బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే.
తాజాగా మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లిలో ఇదే విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. 120 అడుగుల లోతుకు బోరు బేయగా.. బాలుడు 17 అడుగుల లోతులోనే ఉన్నాడు. అంత తక్కువ లోతులో ఉన్నా.. సహాయ బృందాలు ఎంతో వేగంగా స్పందించి 12 గంటల్లోనే బాలుడు పడ్డ ప్రదేశానికి సమాంతరంగా గుంత తవ్వి అతణ్ని చేరుకున్నా ఫలితం లేకపోయింది.
అప్పటికే బాలుడు చనిపోయాడు. మీద మట్టి పెళ్లలు పడటం.. ఫలితంగా ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలుడు బోరు బావిలో పడగా.. ఉదయం ఐదున్నర ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు. నిన్న సాయంత్రం వరకు తమ చుట్టూనే ఉంటూ ఆడుకున్న పిల్లాడు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు.
దారుణమైన విషయం ఏంటంటే.. ఆ బాలుడు పడింది వాళ్ల సొంత బోరులోనే. ఆ బోరు వేసింది కూడా నిన్ననే. 120 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీళ్లు పడలేదు. దీంతో పని ఆపించేశారు. ఐతే నీళ్లు పడని బోరు కావడంతో కేసింగ్ వేయలేదు. దాన్ని పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. సమీపంలోనే ఆడుకుంటున్న పిల్లాడిని గమనించలేదు. అతను బోరు బావిలో పడిపోయాడు. కొన్ని గంటల్లోనే సహాయ బృందాలు వచ్చి ఎంతో కష్టపడ్డా కూడా బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.
This post was last modified on May 28, 2020 12:35 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…