బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే.
తాజాగా మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లిలో ఇదే విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. 120 అడుగుల లోతుకు బోరు బేయగా.. బాలుడు 17 అడుగుల లోతులోనే ఉన్నాడు. అంత తక్కువ లోతులో ఉన్నా.. సహాయ బృందాలు ఎంతో వేగంగా స్పందించి 12 గంటల్లోనే బాలుడు పడ్డ ప్రదేశానికి సమాంతరంగా గుంత తవ్వి అతణ్ని చేరుకున్నా ఫలితం లేకపోయింది.
అప్పటికే బాలుడు చనిపోయాడు. మీద మట్టి పెళ్లలు పడటం.. ఫలితంగా ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలుడు బోరు బావిలో పడగా.. ఉదయం ఐదున్నర ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు. నిన్న సాయంత్రం వరకు తమ చుట్టూనే ఉంటూ ఆడుకున్న పిల్లాడు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు.
దారుణమైన విషయం ఏంటంటే.. ఆ బాలుడు పడింది వాళ్ల సొంత బోరులోనే. ఆ బోరు వేసింది కూడా నిన్ననే. 120 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీళ్లు పడలేదు. దీంతో పని ఆపించేశారు. ఐతే నీళ్లు పడని బోరు కావడంతో కేసింగ్ వేయలేదు. దాన్ని పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. సమీపంలోనే ఆడుకుంటున్న పిల్లాడిని గమనించలేదు. అతను బోరు బావిలో పడిపోయాడు. కొన్ని గంటల్లోనే సహాయ బృందాలు వచ్చి ఎంతో కష్టపడ్డా కూడా బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.
This post was last modified on May 28, 2020 12:35 pm
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…
ఏపీలో కూటమి ప్రభుత్వం చేసే ఖర్చులు, తీసుకునే నిర్ణయాలను సమీక్షించి.. నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా మూడు కమిటీలు ఉంటాయి. ఇది…
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…
పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…