బోరు బావిలో మూడేళ్ల బాలుడు.. బోరు బావిలో రెండేళ్ల పాప.. ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం. ప్రతిసారీ ఆ మాత్రం జాగ్రత్త ఉండదా.. బోరు బావులు పూడ్చాలి లేదా వాటి మీద ఏమైనా అడ్డం పెట్టాలి అన్న జ్ఞానం ఉండదా.. అనుకుంటాం. కానీ మళ్లీ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. వందల కేసుల్లో ఒకటీ అరా మినహాయిస్తే ఇలాంటి సందర్భాల్లో పిల్లల ప్రాణాలు నిలవడం కష్టమే.
తాజాగా మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చన్పల్లిలో ఇదే విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం బోరుబావిలో పడిన సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది. 120 అడుగుల లోతుకు బోరు బేయగా.. బాలుడు 17 అడుగుల లోతులోనే ఉన్నాడు. అంత తక్కువ లోతులో ఉన్నా.. సహాయ బృందాలు ఎంతో వేగంగా స్పందించి 12 గంటల్లోనే బాలుడు పడ్డ ప్రదేశానికి సమాంతరంగా గుంత తవ్వి అతణ్ని చేరుకున్నా ఫలితం లేకపోయింది.
అప్పటికే బాలుడు చనిపోయాడు. మీద మట్టి పెళ్లలు పడటం.. ఫలితంగా ఆక్సిజన్ అందకపోవడంతో బాలుడు ప్రాణాలు విడిచాడు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలుడు బోరు బావిలో పడగా.. ఉదయం ఐదున్నర ప్రాంతంలో మృతదేహాన్ని వెలికి తీశారు. నిన్న సాయంత్రం వరకు తమ చుట్టూనే ఉంటూ ఆడుకున్న పిల్లాడు ఇలా శవమై తేలడంతో తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు.
దారుణమైన విషయం ఏంటంటే.. ఆ బాలుడు పడింది వాళ్ల సొంత బోరులోనే. ఆ బోరు వేసింది కూడా నిన్ననే. 120 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీళ్లు పడలేదు. దీంతో పని ఆపించేశారు. ఐతే నీళ్లు పడని బోరు కావడంతో కేసింగ్ వేయలేదు. దాన్ని పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. సమీపంలోనే ఆడుకుంటున్న పిల్లాడిని గమనించలేదు. అతను బోరు బావిలో పడిపోయాడు. కొన్ని గంటల్లోనే సహాయ బృందాలు వచ్చి ఎంతో కష్టపడ్డా కూడా బాలుడి ప్రాణాలు కాపాడలేకపోయారు.
This post was last modified on May 28, 2020 12:35 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…