మొన్న అంబటి రాంబాబు.. ఇప్పుడేమో అవంతి శ్రీనివాస్.. ఏపీలో అధికార పార్టీకి చెందిన నాయకులు రాసలీలల ఆడియో లీకులతో వరుసగా చిక్కుల్లో పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకున్నపుడు ఆటోమేటిగ్గా అందరి చూపూ ప్రతిపక్ష పార్టీల మీద పడుతుంది. ఆ పార్టీల వాళ్లే ఆయా నేతల్ని టార్గెట్ చేసి ఉంటారని అనుకుంటారు.
కానీ అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల విషయంలో మాత్రం వేరే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వాళ్లే వీళ్లను టార్గెట్ చేశారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వైకాపాలోనే అసమ్మతి వర్గాలు, వీళ్లంటే గిట్టని నాయకులు పకడ్బందీగా ప్లాన్ చేసి వీళ్లను ఇరికించారనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటు అంబటికి, అటు అవంతికి వారి నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలున్నాయి. అంతర్గత కుమ్ములాటలు తక్కువేమీ కాదు. పై స్థాయిలో ఉన్న నాయకులకు వీరిపై మంచి అభిప్రాయం లేదని.. వేరే నేతలను ప్రోత్సహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని సైడ్ లైన్ చేయడానికి ప్లాన్ చేసి ఫోన్ కాల్స్ రికార్డు చేయడం.. వాటిని లీక్ చేయడం చేశారంటున్నారు.
అధికార పార్టీ నేతలను ఇలా టార్గెట్ చేసే స్థితిలో టీడీపీ, జనసేన వాళ్లయితే లేరు. వీళ్లను ముగ్గులోకి దించే వ్యక్తులు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే భరోసాతో అంత ధైర్యంగా ఈ పని చేయలేరు. కచ్చితంగా అధికార పార్టీ నేతల అండ ఉండటంతోనే ఇలాంటివి చేయగలిగారన్నది విశ్లేషకుల అంచనా. ఈ ఆడియో లీక్స్ ముందుగా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు చేరడాన్ని బట్టి కచ్చితంగా ఇది వైసీపీ వాళ్ల పనే అని.. పొమ్మనలేక పొగబెట్టే వ్యవహారంలా ఇది తయారైందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…