ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ చేరుకునే సమయానికే.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారయ్యారు. అయితే.. పరారయ్యే సమయంలో ఆయన డబ్బులు తీసుకోని పారరయ్యారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఆ ఆరోపణలపై ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దాంట్లో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.
అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 మిలియన్ డాలర్లను దొంగిలించి తీసుకెళ్లానని రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లో ఉన్నానని ఘనీ ధ్రువీకరించారు.
తాను డబ్బు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఘని వీడియోలో వివరించారు. తాను నాలుగు కార్లు, హెలికాప్టరు నిండా నగదుతో కాబూల్ నుంచి పారిపోయానని రష్యా రాయబారి చేసిన ఆరోపణలను ఘనీ కొట్టివేశారు. తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు.
దేశంలో రక్తపాతాన్ని నివారించడానికి ఏకైకమార్గంగా తాను కాబూల్ నుంచి పారిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఘనీ సమర్థించుకున్నారు. అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియ వైఫల్యం తాలిబాన్లు అధికారాన్ని లాక్కోవడానికి దారితీసిందని ఆయన చెప్పారు.
తాను మళ్లీ తిరిగి దేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు తాను శాంతియుతంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
This post was last modified on August 19, 2021 10:07 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…