ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద బీజేపీ హై కమాండ్ గుర్రుగా ఉందా. ఆయన ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా కూడా జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దర్శనం లభించడంలేదా. సోము ప్రెసిడెంట్ అయ్యాక ఏపీలో బీజేపీ ఇమేజ్ పాతాళానికి పడిపోయిందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవును అనే వస్తోంది. సోముని తప్పించాలనే హై కమాండ్ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. అర్జంటుగా అయన ప్లేస్ లో కొత్త వారిని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారుట. జమిలి ఎన్నికలు అంటూ కేంద్రం కొత్త రాగం పాడుతున్న నేపధ్యంలో ఏపీ లాంటి చోట్ల పొత్తులు ఎత్తులు గట్టిగా వేయాలంటే సోము స్థానంలో వేరొక నేతను తీసుకురావాల్సిందే అంటున్నారు.
ఇదిలా ఉండగా సోము మీద బీజేపీ మండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయట. వాటిలో ఒకటి సినీ గ్లామర్ తో పాటు చరిష్మా కలిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎడంగా ఉండడం. సోము ఓవర్ యాక్షన్ వల్లనే పవన్ బీజేపీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు అంటున్నారు. సోము కంటే ముందు ప్రెసిడెంట్ గా పనిచేసిన కన్నా లక్ష్మీనారయణ టైమ్ లో అయితే పవన్ జనసేన ప్రతీ కార్యక్రమంలో హుషార్ గా పాల్గోనేదని కూడా చెబుతున్నారు.
సోము ఎంత మెగా ఫ్యామిలీని సన్నిహితుడిని అని చెప్పుకుంటున్నా కూడా అటు నుంచి రియాక్షన్ లేదని అంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగితే పవన్ కళ్యాణ్ ని గట్టిగా ప్రచారానికి ఒకటికి నాలుగు సార్లు రప్పించలేకపోవడం వెనక సోము ఫెయిల్యూర్ ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీకి కూడా సోము బాగా దూరం పాటిస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరారు. వారు ఇపుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. వారిని కలుపుకుని పోవడంలో కూడా సోము విఫలం అయ్యారని అంటున్నారు.
అదే విధంగా సోము ఒక వర్గాన్ని బీజేపీలో కొనసాగిస్తూ వారితోనే అన్నీ అన్నట్లుగా ఉంటున్నారుట. మరి సొంతంగా పార్టీ ఎదగక, ఎత్తులు వ్యూహాలు లేకపోతే ఎలా అంటూ హై కమాండ్ ఆగ్రహిస్తోందిట. అందుకే సోము ప్లేస్ లో తొందరలోనే కొత్త నాయకుడికి ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తారు అంటున్నారు. అది మాజీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ అయినా కావచ్చు అన్నదే ఢిల్లీ కబురుగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!
This post was last modified on August 9, 2021 9:51 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…