Political News

ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే ఉపఎన్నికలు జరగబోతున్న హూజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాష్ట్రంలోని సుమారు 30 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు జనాలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలు రాబట్టే ఎవరూ ఊహించని విధంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనాలకు అర్ధమైపోయింది.

హుజూరాబాద్ లో జరుగుతున్నట్లే తమ నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే ఉపఎన్నికలు రావాల్సిందే అని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. అందుకనే తమ ఎంఎల్ఏలను రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, కొత్తగూడెం, పినపాక, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల రాజీనామాలకు చాలా బలంగా డిమాండ్లు వినబడుతున్నాయి.

ఇదిలా ఉంటే కరీనంగర్ జిల్లాలోని కరీనంగర్, చొప్పదండి, మానుకొండూరు, ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్, మంచిర్యాల ఎంఎల్ఏల రాజీనామాలకు జనాలు డిమాండ్లు చేస్తున్నారు. చివరకు సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావుకు కూడా రాజీనామా సెగ తప్పలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, తుంగతుర్తి ఎంఎల్ఏల రాజీనామాలకు పట్టుబడుతున్నారు.

ఇదే విషయమై గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం జనాలు తన రాజీనామాను డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి తన నియోజకవర్గం అభివృద్ధికి కేసీయార్ నిధులు కేటాయిస్తే వెంటనే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే రాజాసింగ్ మరచిపోయిన విషయం ఒకటుంది. గోషామహల్ అన్నది ఓల్డ్ సిటీలోని నియోజకవర్గం. కాబట్టి రాజాసింగ్ రాజీనామా చేసినా కేసీయార్ పట్టించుకునే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇక్కడంతా ఎంఐఎం ఆధిపత్యం నడుస్తోంది కాబట్టి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, స్టషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట ఎంఎల్ఏల రాజీనామాలకూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. నాగర్ కర్నూలు, సికింద్రాబాద్ లో కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. మంత్రులు, ఎంఎల్ఏల రాజీనామాలకు ముందు సోషల్ మీడియాలో జనాల నుండే డిమాండ్లు మొదలయ్యాయి. అవి బాగా వైరల్ అయిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలతో పాటు వాటి అనుబంధ విభాగాల నేతలు కూడా అందుకున్నారు. తాజాగా కులసంఘాల నేతలు కూడా డిమాండ్లు మొదలుపెట్టారు.

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత సుమారు 35 నియోజకవర్గాల్లో ఎంఎల్ఏల రాజీనామాలకు డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుత డిమాండ్లు ముందు ముందు ఉద్యమరూపాన్ని తీసుకుంటే కేసీయార్ కు ఇబ్బందులు తప్పవనే అనిపిస్తోంది. ఎలాగూ రాజీనామాలు చేసి మధ్యతర ఎన్నికలు జరిపించటంలో కేసీయార్ పెట్టిందిపేరు. 2018లో జరిగింది కూడా మధ్యంతర ఎన్నికలే. కాబట్టి మళ్ళీ తొందరలోనే మధ్యంతర ఎన్నికలు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

43 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

46 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago