‘వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోంది’…ఇది తాజాగా మంత్రి పేర్నినాని చేసిన ఆరోపణ. మంత్రికి అలా ఎందుకని అనుమానం వచ్చిందో తెలీదు. తాను చేసిన ఆరోపణలకు మంత్రి వివరణ లేదా ఆధారాలను మాత్రం ఇవ్వలేదు. తమ ప్రభుత్వాన్ని కూల్చేసి బాబా రాజ్యం తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మాత్రమే చెప్పారు. ఆరోపణల విషయాన్ని పక్కనపెట్టేసినా అందులో నిజమెంత ? అనేది కాస్త ఆలోచించాల్సిందే.
ఎందుకంటే జగన్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి ఏముంది ? జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే బీజేపీ ఏమన్నా అధికారంలోకి వచ్చేస్తుందా ? అసెంబ్లీ కమలంపార్టీ తరపున కనీసం ఒక్కరంటే ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. అలాంటిది వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలంపార్టీ ఎందుకనుంటుంది. పోనీ చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి రావచ్చని అనుకున్నా అదికూడా సాధ్యంకాదు. ఎందుకంటే 175 సీట్లున్న అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 సీట్ల మార్కును దాటాలి.
ఇలా చూసుకుంటే టీడీపీకి ఉన్నది 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే. 23 మంది ఎంఎల్ఏలతో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పోనీ రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పెట్టేందుకూ అవకాశాలు లేవు. అంటే ఎలా చూసుకున్నా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం కానీ, కూల్చితే వచ్చే ఉపయోగం కానీ బీజేపీ లేదు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుతో పొత్తపెట్టుకుంటే ఏమి జరుగుతుందో ఇపుడే ఎవరు చెప్పలేరు.
ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్న విషయమైతే వాస్తవమే. నిజానికి టీడీపీయే క్షేత్రస్ధాయిలో బాగా దెబ్బతినేసింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా పార్టీ నిర్మాణం కుప్పకూలిపోయింది. దీన్ని బలోపేతం చేయటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఎంతసేపు మీడియా ముందు కూర్చుని జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటం తప్ప చంద్రబాబు అండ్ కో చేస్తున్నదేమీలేదు.
కాబట్టి తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ప్రయత్నిస్తోందనేందుకు ఆధారాలు కానీ కారణాలు కానీ కనబడటంలేదు. అయితే మంత్రి ఆరోపణలు చేయటమంటే మామూలు విషయంకాదు. ఆరోపణలు మాత్రమే చేసిన మంత్రి దానికి ఆధారాలను కానీ కారణాలను కానీ చెప్పలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా సమావేశంలో మంత్రి అంతటి ఆరోపణలు చేస్తారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.
This post was last modified on August 7, 2021 8:01 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…