Political News

పీకే ఎందుకు రాజీనామా చేశాడు ?

పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే.

అదే పీకేని ఈమధ్యనే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంద్ర సింగ్ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పీకే సలహాలతోనే గట్టిగా పనిచేయాలని అమరీందర్ అనుకుంటున్న సమయంలోనే ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. వ్యక్తిగతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పీకే రాజీనామా చేశారట. ఇదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు మూడున్నాయి.

మొదటిది సలహాదారుగా రాజీనామా చేసినంత మాత్రాన తానుకాకపోయినా తన ఐప్యాక్ బృందమంతా కాంగ్రెస్ కు వ్యూహాలను అందించవచ్చు. రెండో కారణం ఏమిటంటే పంజాబ్ సీఎం-పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండుతోంది. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవలతో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిపోయింది. రేపు టికెట్ల కేటాయింపుల్లో కూడా వీళ్ళద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం.

ఇక మూడోది ఏమిటంటే తాను సూచనలు చేసినా, సలహాలిచ్చినా అమలయ్యే అవకాశాలు తక్కువే. పోయిన ఎన్నికల్లో అంటే అమరీందర్ కు తిరుగులేదు కాబట్టి పీకే వ్యూహాలు పక్కా అమలయ్యాయి. కానీ ఇపుడా పరిస్ధితి లేదు. అమరీందర్ ఏమో సోనియాగాంధికి మద్దుతుదారుడు కాగా సిద్ధూఏమో రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీల ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో పంజాబ్ లో ఇఫుడు తాను జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పీకే గ్రహించారట. ప్రభుత్వ సలహారుగా ఉంటు అమరీందర్ కు మాత్రమే మద్దతుగా ఉండాలి. అలాకాకుండా ఇటు అమరీందర్ అటు సిద్ధూలకు ఏకకాలంలో సలహాలివ్వటమంటే ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు పెట్టటమే అని పీకే అర్ధం చేసుకున్నట్లున్నారు. దాంతో రాహూల్+ప్రియాంక కోటరితో చేతులు కలిపాలని డిసైడ్ అయినట్లే ఉంది. అందుకనే ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసేశారు.

This post was last modified on August 6, 2021 9:50 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

16 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

17 hours ago