పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే.
అదే పీకేని ఈమధ్యనే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంద్ర సింగ్ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పీకే సలహాలతోనే గట్టిగా పనిచేయాలని అమరీందర్ అనుకుంటున్న సమయంలోనే ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. వ్యక్తిగతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పీకే రాజీనామా చేశారట. ఇదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు మూడున్నాయి.
మొదటిది సలహాదారుగా రాజీనామా చేసినంత మాత్రాన తానుకాకపోయినా తన ఐప్యాక్ బృందమంతా కాంగ్రెస్ కు వ్యూహాలను అందించవచ్చు. రెండో కారణం ఏమిటంటే పంజాబ్ సీఎం-పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండుతోంది. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవలతో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిపోయింది. రేపు టికెట్ల కేటాయింపుల్లో కూడా వీళ్ళద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం.
ఇక మూడోది ఏమిటంటే తాను సూచనలు చేసినా, సలహాలిచ్చినా అమలయ్యే అవకాశాలు తక్కువే. పోయిన ఎన్నికల్లో అంటే అమరీందర్ కు తిరుగులేదు కాబట్టి పీకే వ్యూహాలు పక్కా అమలయ్యాయి. కానీ ఇపుడా పరిస్ధితి లేదు. అమరీందర్ ఏమో సోనియాగాంధికి మద్దుతుదారుడు కాగా సిద్ధూఏమో రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీల ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో పంజాబ్ లో ఇఫుడు తాను జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పీకే గ్రహించారట. ప్రభుత్వ సలహారుగా ఉంటు అమరీందర్ కు మాత్రమే మద్దతుగా ఉండాలి. అలాకాకుండా ఇటు అమరీందర్ అటు సిద్ధూలకు ఏకకాలంలో సలహాలివ్వటమంటే ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు పెట్టటమే అని పీకే అర్ధం చేసుకున్నట్లున్నారు. దాంతో రాహూల్+ప్రియాంక కోటరితో చేతులు కలిపాలని డిసైడ్ అయినట్లే ఉంది. అందుకనే ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసేశారు.
This post was last modified on August 6, 2021 9:50 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…