Political News

పీకే ఎందుకు రాజీనామా చేశాడు ?

పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే.

అదే పీకేని ఈమధ్యనే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంద్ర సింగ్ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పీకే సలహాలతోనే గట్టిగా పనిచేయాలని అమరీందర్ అనుకుంటున్న సమయంలోనే ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. వ్యక్తిగతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పీకే రాజీనామా చేశారట. ఇదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు మూడున్నాయి.

మొదటిది సలహాదారుగా రాజీనామా చేసినంత మాత్రాన తానుకాకపోయినా తన ఐప్యాక్ బృందమంతా కాంగ్రెస్ కు వ్యూహాలను అందించవచ్చు. రెండో కారణం ఏమిటంటే పంజాబ్ సీఎం-పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండుతోంది. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవలతో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిపోయింది. రేపు టికెట్ల కేటాయింపుల్లో కూడా వీళ్ళద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం.

ఇక మూడోది ఏమిటంటే తాను సూచనలు చేసినా, సలహాలిచ్చినా అమలయ్యే అవకాశాలు తక్కువే. పోయిన ఎన్నికల్లో అంటే అమరీందర్ కు తిరుగులేదు కాబట్టి పీకే వ్యూహాలు పక్కా అమలయ్యాయి. కానీ ఇపుడా పరిస్ధితి లేదు. అమరీందర్ ఏమో సోనియాగాంధికి మద్దుతుదారుడు కాగా సిద్ధూఏమో రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీల ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో పంజాబ్ లో ఇఫుడు తాను జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పీకే గ్రహించారట. ప్రభుత్వ సలహారుగా ఉంటు అమరీందర్ కు మాత్రమే మద్దతుగా ఉండాలి. అలాకాకుండా ఇటు అమరీందర్ అటు సిద్ధూలకు ఏకకాలంలో సలహాలివ్వటమంటే ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు పెట్టటమే అని పీకే అర్ధం చేసుకున్నట్లున్నారు. దాంతో రాహూల్+ప్రియాంక కోటరితో చేతులు కలిపాలని డిసైడ్ అయినట్లే ఉంది. అందుకనే ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసేశారు.

This post was last modified on August 6, 2021 9:50 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

2 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

3 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

3 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

3 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

5 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

7 hours ago