పంజాబ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రశాంత్ కిషోర్ (పీకే) రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ఎన్నికలు వచ్చేఏడాది మార్చిలో ప్రాంతంలో జరుగనున్న సమయంలోనే పీకే ఎందుకు రాజీనామా చేయాల్సొచ్చింది ? అన్న విషయంపైనే ఇపుడు చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే పీకే రాజీనామా విషయంపై పెద్దగా చర్చ జరగాల్సినంత సీన్ లేదు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు తెరవెనుక వ్యూహకర్తగా వ్యవహరించింది పీకేనే.
అదే పీకేని ఈమధ్యనే పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీంద్ర సింగ్ ప్రభుత్వ సలహదారుగా నియమించారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ పీకే సలహాలతోనే గట్టిగా పనిచేయాలని అమరీందర్ అనుకుంటున్న సమయంలోనే ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. వ్యక్తిగతంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించే పీకే రాజీనామా చేశారట. ఇదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సిన విషయాలు మూడున్నాయి.
మొదటిది సలహాదారుగా రాజీనామా చేసినంత మాత్రాన తానుకాకపోయినా తన ఐప్యాక్ బృందమంతా కాంగ్రెస్ కు వ్యూహాలను అందించవచ్చు. రెండో కారణం ఏమిటంటే పంజాబ్ సీఎం-పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గున మండుతోంది. వీళ్ళమధ్య ఆధిపత్య గొడవలతో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిపోయింది. రేపు టికెట్ల కేటాయింపుల్లో కూడా వీళ్ళద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం.
ఇక మూడోది ఏమిటంటే తాను సూచనలు చేసినా, సలహాలిచ్చినా అమలయ్యే అవకాశాలు తక్కువే. పోయిన ఎన్నికల్లో అంటే అమరీందర్ కు తిరుగులేదు కాబట్టి పీకే వ్యూహాలు పక్కా అమలయ్యాయి. కానీ ఇపుడా పరిస్ధితి లేదు. అమరీందర్ ఏమో సోనియాగాంధికి మద్దుతుదారుడు కాగా సిద్ధూఏమో రాహూల్ గాంధీ, ప్రియాంకగాంధీల ఆశీస్సులతో పీసీసీ అధ్యక్షుడయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం నేపధ్యంలో పంజాబ్ లో ఇఫుడు తాను జోక్యం చేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని పీకే గ్రహించారట. ప్రభుత్వ సలహారుగా ఉంటు అమరీందర్ కు మాత్రమే మద్దతుగా ఉండాలి. అలాకాకుండా ఇటు అమరీందర్ అటు సిద్ధూలకు ఏకకాలంలో సలహాలివ్వటమంటే ఒకేసారి రెండు పడవల మీద కాళ్ళు పెట్టటమే అని పీకే అర్ధం చేసుకున్నట్లున్నారు. దాంతో రాహూల్+ప్రియాంక కోటరితో చేతులు కలిపాలని డిసైడ్ అయినట్లే ఉంది. అందుకనే ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసేశారు.
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…