ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్.. మరో కీలక పదవి నుంచి తప్పుకున్నారు. త్వరలో పంజాబ్ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
ఇంతకాలం..పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితం లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని.. దయ చేసి తనను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయాలని ఆయన సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం ప్రస్తుత రాజకీయల్లో కొత్త చర్చకు తెర లేపింది.
This post was last modified on August 5, 2021 6:45 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…
పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…