ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్.. మరో కీలక పదవి నుంచి తప్పుకున్నారు. త్వరలో పంజాబ్ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
ఇంతకాలం..పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రిన్సిపల్ సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితం లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని.. దయ చేసి తనను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయాలని ఆయన సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం ప్రస్తుత రాజకీయల్లో కొత్త చర్చకు తెర లేపింది.
This post was last modified on August 5, 2021 6:45 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…