రాష్ట్రానికి జీవనాడి అయిన.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయం చేయాలని భావించిన వైసీపీ ఎదురు దెబ్బతగిలిందా ? ఆ పార్టీ ఎంపీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి.. విజయసాయిరెడ్డి ఒకటి తలిస్తే.. మరొకటి జరిగిందా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. పోలవరం విషయాన్ని గత చంద్రబాబు సర్కారు సీరియస్గానే తీసుకుంది. ఈ క్రమంలో వారం వారం పోలవరం పనులను చంద్రబాబు సమీక్షించేవారు. అవసరమైన ప్రతిసారీ.. ఆయనే నేరుగా ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లి పనులు పరిశీలించారు. ఇక, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా.. కూడా పనులు ముందుకు సాగేలా కాంట్రాక్టర్ సంస్థలను ఒప్పించారు.
ఈ క్రమంలోనే పెరిగిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో చంద్రబాబు హయాంలోనే పోలవరం అంచానలను 20 వేల కోట్ల నుంచి 47 వేల కోట్లకు ఆ తర్వాత 55 వేల కోట్ల రూపాయలకు పెంచారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునే క్రమంలో ఎన్నికలు జరగడంతో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చింది. దీనిని తమ తండ్రిగారే స్థాపించారు కాబట్టి.. తమ హయాంలోనే పూర్తిచేస్తామని.. నిధులు కూడా తెస్తామని.. వైసీపీ అధినేత జగన్ పదే పదే ప్రకటించారు. దీనిపై ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. కేంద్ర పెద్దల వద్ద మాట్లాడుతున్నామని.. 55 వేల కోట్ల రూపాయలకు కేంద్రాన్ని ఆమోదించేలా ఒప్పిస్తున్నామని.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కూడా ప్రకటిస్తూ.. వచ్చారు.
అయితే.. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మీరు ఢిల్లీ వెళ్లింది.. కేంద్రంతో మీ కేసుల విషయంలో రాజీ చేసుకునేందుకేనని.. మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు ఎప్పటికప్పుడు విమర్శలు సంధించారు. దీంతో ఒకింత ఆత్మ రక్షణలో పడిన వైసీపీ సర్కారు.. దీనికి కేంద్రం నుంచే సమాధానం ఇప్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ముందు వెనుక ఆలోచించకుండా.. అసలు క్షేత్రస్థాయిలో కేంద్రం దగ్గర ఏం జరుగుతోందో.. కూడా తెలియకుండానే.. సాయిరెడ్డి పార్లమెంటు వేదికగా నోటీసు ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఈ విషయంలో గుంభనంగా ఉన్న కేంద్రం పార్లమెంటులో నిజానిజాలు చెప్పక తప్పలేదు. దీంతో వైసీపీ ఇప్పుడు పూర్తిగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది.
ఇటీవల పార్లమెంటు వేదిగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తాము అంచనాలు పెంచేది లేదన్నారు. అంతేకాదు.. అసలు ఈ ప్రతిపాదన ఏదీ కూడా తమకు రాలేదని చెప్పారు. మరోవైపు.. 2014లో విభజన చట్టం సమయంలో వేసిన అంచనా మేరకు 22 వేల కోట్ల రూపాయలకు మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని..పునరావాసం.. వంటి ఖర్చును రాష్ట్ర సర్కారే భరించాలని కుండబద్దలు కొట్టారు.
అంటే.. ఇప్పటి వరకు వైసీపీ నేతలు చెప్పిన మాటలు అన్నీ కూడా తేలిపోయాయి. ముఖ్యంగా సాయిరెడ్డి చెబుతూ.. వచ్చిన.. మేం ఢిల్లీలో పోలవరం పై మాట్లాడుతున్నామన్న ఆయన వ్యాఖ్యలు నిజం కాదని తేలిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీ పరువు అన్ని విధాలా పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 30, 2021 12:10 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…