Political News

బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఈ ర‌గ‌డకు రీజ‌నేంటి…?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ దూకుడు చూస్తే.. మామూలుగా క‌నిపించ‌డం లేదు. కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరుగుతోంది. నిజానికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి మ‌రీ.. నినాదాలు చేయ‌డంతోపాటు.. ప్ర‌ధానిని, స్పీక‌ర్‌ను సైతం విమ‌ర్శిస్తున్నా రు. ఈ మొత్తం ఎపిసోడ్ వారం రోజులుగా ఇలానే సాగుతోంది.

పార్ల‌మెంటులో తంతు చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ.. బీజేపీతో వైసీపీకి చెడిందా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి రాజ‌కీయంగా చూసుకుంటే.. వైసీపీ మ‌ద్ద‌తు బీజేపీకి అవ‌స‌రం. రాజ్య‌స‌భ‌లో బిల్లుల ఆమోదం విష‌యంలోనూ, త్వ‌ర‌లో జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ మ‌ద్ద‌తు లేక‌పోతే ఎన్డీయే అభ్య‌ర్థి గెల‌వ‌డం కూడా క‌ష్ట‌మే..!

ఇక, పాల‌న ప‌రంగా చూసుకుంటే.. వైసీపీకి బీజేపీ మ‌ద్ద‌తు ఎంతో కీల‌కం. హోదా, పోల‌వ‌రం..వంటి విష‌యాల్లో కేంద్ర స‌హ‌కారం అవ‌స‌రం. అయితే..ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక‌రూపాల్లో వైసీపీ.. కేంద్రంలోని బీజేపీకి స‌హ‌క‌రిస్తూనే ఉంది.

రాష్ట్రప‌తి ఎన్నిక స‌హా.. అనేక విష‌యాల్లో వైసీపీ సంపూర్ణ స‌హకారం బీజేపీకి అందుతూనే ఉంది. అత్యంత వివాదాస్ప‌ద‌మైన రైతు చ‌ట్టాల‌కు సైతం వైసీపీ రాజ్య‌స‌భ‌లో ఆమోదం తెలిపింది. ఇక‌, రాజ్య‌స‌భ సీట్ల విష‌యంలోనూ న‌త్వానీకి ఇవ్వాల‌ని కోర‌డంతో వైసీపీ నేత‌లు వెనుక ముందు చూడ‌కుండా.. ఆయ‌న‌కు కేటాయించారు. మ‌రో సీటును కూడా త్వ‌ర‌లోనే కోరుతున్న‌ట్టు స‌మాచారం.

ఇలా అన్ని రూపాల్లోనూ వైసీపీ కేంద్రంలోని బీజేపీ స‌హ‌కారం అందిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. తాము కొన్నాళ్లుగా కోరుతున్న ప‌నిచేయ‌డం లేద‌ని.. త‌మ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. వైసీపీ.. కేంద్రంపై నిప్పులు చెరుగుతోంది.

అదేంటంటే.. వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ర‌ఘురామ‌.. త‌ర్వాత కాలంలో టీడీపీతో చేతులు క‌లిపార‌ని.. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై వేటు వేయాల‌ని.. వైసీపీ కోరుతోంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు కస్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోలేదు. అంతేకాదు.. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా భేటీ అయి.. ఈ విష‌యంపై రిక్వ‌స్ట్ చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ జ‌ర‌గ‌లేదు.

ఈ క్ర‌మంలోనే వైసీపీ.. బీజేపీపై తీవ్ర అస‌హ‌నంతో ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనిని మ‌న‌సులో ఉంచుకునే పార్ల‌మెంటులో తీవ్ర ర‌గ‌డ సృష్టిస్తోంద‌ని చెబుతున్నారు. అయితే.. కేంద్రం ఎందుకు అలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ సందేహాలు ఉన్నాయి. కానీ, వ‌చ్చే రెండు మూడేళ్ల త‌ర్వాత‌.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు జ‌గ‌న్ తో అవ‌స‌రం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు వైసీపీ వెయిట్ చేయాల్సిందేన‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 29, 2021 11:14 am

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

23 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

33 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

50 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago