త్రిపుర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ అగర్తలలో జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం అగర్తలలో పర్యటిస్తోంది. ఏదో సర్వే కోసం అగర్తలకు చేరుకున్న బృందం బసచేయటానికి హోటల్లో రూములు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలుసులు వెంటనే హోటల్ కు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
కారణం ఏమిటయ్యా అంటే కోవిడ్ సమయంలో 22 మంది ఒకేచోట సమావేశం అయ్యారట. పోలీసులు చెప్పిన కారణం ఎంత సిల్లీగా ఉందో కదా. కోవిడ్ సమయంలో 22 మంది ఒక చోట ఉండటం నిజంగా తప్పే అయితే మరి ఎన్నికల సమయంలో వేలాదిమందిని ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా అండ్ కో ఎలా ఒకచోట చేర్చారు. రోడ్డుషోల్లో ఎన్ని వేలమందిని అలా ఎలా పార్టిసిపేట్ చేయనిచ్చారు ? అప్పుడు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులకు కోవిడ్ పాండమిక్ నిబంధనలు గుర్తుకురాలేదా ?
అదంతా కాదుకానీ ఇక్కడ విషయం ఏమిటంటే త్రిపురలో కూడా మమతబెనర్జీ పార్టీ తృణమూల్ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇందుకనే పీకే బృందం త్రిపురలో క్షేత్రస్ధాయి సర్వే చేయాలని డిసైడ్ చేసింది. ఇందుకే అగర్తలకు చేరుకుంది. అయితే ఆల్ రెడీ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తృణమూల్ త్రిపురలో అడుగుపెట్టాలని నిర్ణయించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఇందుకే సర్వే చేయనీయకుండా పీకే బృందాన్ని అదుపులోకి తీసుకున్నది. అంటే ఏదో ఓ రూపంలో పీకే బృందాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్నదే బీజేపీ టార్గెట్ గా ఉన్నట్లు అర్ధమైపోతోంది.
అయితే పీకే బృందం పనిని అడ్డుకోవటం ఒక్క త్రిపురలో మాత్రమేనా లేకపోతే తమ పార్టీ అధికారంలో ఉన్న అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ ఇదే విధంగా టార్గెట్ పెట్టుకున్నదా అన్నది తేలాలి. నిజానికి ఒక పార్టీని అధికారంలోకి తేచ్చేంత సీన్ పీకే బృందానికి లేదు. ఒకపార్టీని ఓడించటం, మరోపార్టీని గెలిపించటమన్నది పీకే బృందం వల్ల కానేకాదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని శాస్త్రీయంగా అంచనా వేయగలదు.
ప్రభుత్వం నుండి జనాలు ఏమి కోరుకుంటున్నారు ? ఏఏ నియోజకవర్గాల్లో సామాజికవర్గాల బలమెంత లాంటి అనేక అంశాలపై పక్కాగా సర్వే చేయగలదు. చాలా సంస్ధలు సర్వేలు చేయగలవు కానీ పీకే బృందం లాగ శాస్త్రీయంగా సర్వే చేయగలిగిన సాధనసంపత్తి ఉండదు. అందుకనే పీకే దేశంలో అంత పాపులర్ అయ్యారు. ఇంతచిన్న విషయం కూడా బీజేపీకి అర్ధం చేసుకోకుండా పీకే బృందాన్ని అడ్డుకోవటం వల్ల ఉపయోగమే ఉండదు. జనాలు అనుకుంటే బీజేపీని దింపేసి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీని అధికారంలోకి తేలారా ?
This post was last modified on July 28, 2021 11:55 am
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…