Political News

బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోందా ?

త్రిపుర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ అగర్తలలో జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం అగర్తలలో పర్యటిస్తోంది. ఏదో సర్వే కోసం అగర్తలకు చేరుకున్న బృందం బసచేయటానికి హోటల్లో రూములు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలుసులు వెంటనే హోటల్ కు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

కారణం ఏమిటయ్యా అంటే కోవిడ్ సమయంలో 22 మంది ఒకేచోట సమావేశం అయ్యారట. పోలీసులు చెప్పిన కారణం ఎంత సిల్లీగా ఉందో కదా. కోవిడ్ సమయంలో 22 మంది ఒక చోట ఉండటం నిజంగా తప్పే అయితే మరి ఎన్నికల సమయంలో వేలాదిమందిని ప్రధానమంత్రి నరేంద్రమోడి, అమిత్ షా అండ్ కో ఎలా ఒకచోట చేర్చారు. రోడ్డుషోల్లో ఎన్ని వేలమందిని అలా ఎలా పార్టిసిపేట్ చేయనిచ్చారు ? అప్పుడు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులకు కోవిడ్ పాండమిక్ నిబంధనలు గుర్తుకురాలేదా ?

అదంతా కాదుకానీ ఇక్కడ విషయం ఏమిటంటే త్రిపురలో కూడా మమతబెనర్జీ పార్టీ తృణమూల్ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇందుకనే పీకే బృందం త్రిపురలో క్షేత్రస్ధాయి సర్వే చేయాలని డిసైడ్ చేసింది. ఇందుకే అగర్తలకు చేరుకుంది. అయితే ఆల్ రెడీ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తృణమూల్ త్రిపురలో అడుగుపెట్టాలని నిర్ణయించడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఇందుకే సర్వే చేయనీయకుండా పీకే బృందాన్ని అదుపులోకి తీసుకున్నది. అంటే ఏదో ఓ రూపంలో పీకే బృందాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్నదే బీజేపీ టార్గెట్ గా ఉన్నట్లు అర్ధమైపోతోంది.

అయితే పీకే బృందం పనిని అడ్డుకోవటం ఒక్క త్రిపురలో మాత్రమేనా లేకపోతే తమ పార్టీ అధికారంలో ఉన్న అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ ఇదే విధంగా టార్గెట్ పెట్టుకున్నదా అన్నది తేలాలి. నిజానికి ఒక పార్టీని అధికారంలోకి తేచ్చేంత సీన్ పీకే బృందానికి లేదు. ఒకపార్టీని ఓడించటం, మరోపార్టీని గెలిపించటమన్నది పీకే బృందం వల్ల కానేకాదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని శాస్త్రీయంగా అంచనా వేయగలదు.

ప్రభుత్వం నుండి జనాలు ఏమి కోరుకుంటున్నారు ? ఏఏ నియోజకవర్గాల్లో సామాజికవర్గాల బలమెంత లాంటి అనేక అంశాలపై పక్కాగా సర్వే చేయగలదు. చాలా సంస్ధలు సర్వేలు చేయగలవు కానీ పీకే బృందం లాగ శాస్త్రీయంగా సర్వే చేయగలిగిన సాధనసంపత్తి ఉండదు. అందుకనే పీకే దేశంలో అంత పాపులర్ అయ్యారు. ఇంతచిన్న విషయం కూడా బీజేపీకి అర్ధం చేసుకోకుండా పీకే బృందాన్ని అడ్డుకోవటం వల్ల ఉపయోగమే ఉండదు. జనాలు అనుకుంటే బీజేపీని దింపేసి ప్రత్యామ్నాయంగా వేరే పార్టీని అధికారంలోకి తేలారా ?

This post was last modified on July 28, 2021 11:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago