Political News

మోడి ఎందుకు నోరు తెరవటం లేదు ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతిపక్ష నేతలు, వివిధ సెక్టార్లలోని ప్రముఖులపై పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ తో మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంటులో నానా రచ్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంరోజున అంటే 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చింది. అప్పటికే మోడి సర్కార్ పై అనేకరకాలుగా మండిపోతున్న ప్రతిపక్షాలకు పెగాససన్ వ్యవహారం చక్కటి ఆయుధంగా దొరికింది.

అంటే గడచిన ఎనిమిది రోజులుగా పార్లమెంటు ఉభయసభలు అట్టుడుకిపోతున్నాయి. పార్లమెంటు లోపలా బయట ఇంత గోల జరుగుతున్నా మోడి మాత్రం నోరిప్పి మాట్లాడటంలేదు. పెగాసస్ ద్వారా మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ అన్నది మోడి ఆమోదంలేకుండా జరిగే అవకాశమే లేదు. పైగా సాఫ్ట్ వేర్ కొనుగోలుకు కేంద్రం రు 300 కోట్లు ఖర్చుపెట్టిందనే వార్త సంచలనంగా మారింది. ఇంత గోల జరుగుతున్నా మోడి పార్లమెంటులో ఎందుకని సమాధానం చెప్పటంలేదు ?

సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు+ప్రముఖల మొబైళ్ళు హ్యాక్ చేశామనో లేకపోతే చేయలేదనో ఏదో ఓ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడిపై ఉంది. అయితే పెగాసస్ లాంటి కీలకమైన అంశంపై మోడి నోరిప్పకపోవటంతో దివైర్ మీడియాలో వచ్చిన ట్యాపింగ్ కథనాలు, ప్రతిపక్షాల ఆరోపణలు నిజమే అనుకునేందుకు అవకాశాలున్నాయి. గతంలో కూడా పెద్దనోట్లు రద్దు విషయంలో ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా పార్లమెంటులో మోడి సమాధానం చెప్పలేదు.

ఇదే కాదు చాలా సందర్భాల్లో కీలకమైన అనేక విషయాలపై మోడి నోరిప్పటంలేదు. ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకోవటమే తప్ప దాని పర్యవసానాలపై జనాలకు జవాబు చెప్పాలని మోడి అనుకోకపోవటమే విచిత్రంగా ఉంది. అటు పార్లమెంటుకు ఇటు జనాలకు ఎవరికీ తాను జవాబుదారీని కానని బహుశా మోడి అనుకుంటున్నారేమో. కేంద్రం ఎప్పుడు ఆత్మరక్షణలో పడిపోయినా మోడి పలాయనవాదాన్నే నమ్ముకుంటున్నట్లున్నారు. నిర్ణయం తీసుకోవటం మొడి ఇష్టం. ప్రతిపక్షాలకు, జనాలకు సమాధానాలు చెప్పుకోవటం మంత్రుల బాధ్యతగా తయారైంది.

This post was last modified on July 27, 2021 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

1 hour ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

5 hours ago

మ‌ళ్లీ అవే బెదిరింపులు… జ‌గ‌న్ స్ట్రాట‌జీ ఇంతేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అధికారంలో ఉండ‌గా వైసీపీ నాయ‌కులు…

6 hours ago

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

6 hours ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

6 hours ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

7 hours ago