Political News

ఇకనుండి రాహూల్ ది దూకుడు మంత్రమేనా ?

పార్టీని బలోపేతం చేసే విషయంలో రాహూల్ గాంధీకి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినట్లుంది. అన్నీ రాష్ట్రాల్లో పార్టీని పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యారట. పంజాబ్ లో అమరీందర్-సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించిన పద్దతిలోనే రాజస్ధాన్ వ్యవహారాన్ని కూడా రాహూల్ డైరెక్టుగా డీల్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈనెలాఖరులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్-కీలక నేత సచిన్ పైలెట్ తో భేటి అవ్వాలని రాహూల్ నిర్ణయించుకున్నారట. దీంతో సుదీర్ఘంగా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయనే అనుకుంటున్నారు.

నిజానికి పార్టీ వ్యవహారాలను రాహూల్ పట్టించుకుని చాలా కాలమే అయ్యింది. చాలా రాష్ట్రాల్లో సీనియర్ నేతల మధ్య పెద్ద వివాదాలే నడుస్తున్నా ఏరోజు వాటిని రాహూల్ పట్టించుకోలేదు. నేతల మధ్య విభేదాలను పట్టించుకోని ఫలితంగానే మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేతులార పడదోసుకున్నారు. మాజీ సీఎం కమలనాద్-జ్యోతిరాధిత్య సింథియా మధ్య వివాదాలు పెరిగిపోయి చివరకు ప్రభుత్వమే కూలిపోయింది.

ఇంతకాలం పార్టీని పట్టించుకోని యువరాజు హఠాత్తుగా ఎందుకింత ఇంట్రస్టు చూపిస్తున్నట్లు ? ఎందుకంటే దేశంలో జనాలు ఓట్లేయటానికి సిద్ధంగానే ఉన్న వేయించుకునేందుకు కాంగ్రెస్ నేతలే సిద్ధంగా లేరు. ఈ విషయం బీహార్, బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో రుజువైంది. అయితే ఆ ఎన్నికలను వదిలేస్తే తాజాగా యావత్ దేశంలో నరేంద్రమోడి సర్కార్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈమధ్యనే సోనియాగాంధి, రాహూల్ తో సమావేశమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా వివరించారట.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటి ? కంగ్రెస్ పరిస్ధితేంటి అనే విషయాన్ని పీకే లెక్కలతో సహా వివరించారట. ఇపుడు గనుక మేల్కొనకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని పీకే స్పష్టంగా చెప్పేశారట. పైగా ఒకవైపు మోడి వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. బీహార్ లో తేజస్వీయాదవ్, బెంగాల్లో మమతబెనర్జీ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు.

సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాతే తాను పార్టీలో యాక్టివ్ అవ్వాలని రాహూల్ డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే పంజాబ్ లో వివాదాలపై దృష్టిపెట్టారు. పైగా పార్టీలో వృద్ధతరాన్ని పక్కనపెట్టేసి యువకులకు పెద్దపీట వేయాలని కూడా డిసైడ్ చేశారట. ఇందులో భాగంగానే పంజాబ్, తెలంగాణా, మహారాష్ట్రాల్లో పార్టీ పగ్గాలను యువకులకు అప్పగించారు. పీకే యువమంత్రాన్ని రాహూల్ బాగానే వంటపట్టించుకున్నట్లున్నారు. రాహూల్ యాక్టివ్ అయితే పార్టీకే మంచిది కదా. చూద్దాం ఏ స్ధాయిలో యాక్టివ్ అవుతారో.

This post was last modified on July 27, 2021 8:15 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

4 hours ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

5 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

5 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

8 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

9 hours ago