జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తేలిపోయిందా ? తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరిలోను ఇదే సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో మంచి పట్టుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ దెబ్బకు జనసేన తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.
రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలుంటే జనసేన గెలిచింది కేవలం ఒకే ఒక నియోజకవర్గం రాజోలులో మాత్రమే. సరే అప్పుడంటే ఏదో అలా జరిగిపోయిందని జనసైనికులు సరిపెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ తడాఖా ఏమిటో చూపుతామని గట్టి సవాళ్ళే చేశారు. మార్చి 10వ తేదీన రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగినట్లే ఏలూరు కార్పొరేషన్ కు కూడా జరిగింది. కాకపోతే ఓటర్ల లిస్టులో అవకతవకలున్నాయనే కారణంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.
కోర్టులో కేసు పరిష్కారమైన తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 50 డివిజన్లలో 47 చోట్ల వైసీపీ గెలిచింది. మిగిలిన 3 చోట్ల టీడీపీ నెగ్గింది. జనసేన పోటీచేసిన 20 డివిజన్లు+బీజేపీ పోటీచేసిన 16 డివిజన్లలో మిత్రపక్షాలు కనీసం ఒక్క డివిజన్లో కూడా ఎక్కడా గెలవలేదు. నిజానికి ఏలూరులో కాపుల ప్రాబల్యమే చాలా ఎక్కువ. పైగా ఏలూరుపై దృష్టిపెట్టిన పవన్ ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు.
మిత్రపక్షాల్లో బీజేపీకి క్షేత్రస్ధాయిలో పెద్ద బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కమలనాదుల్లో ఎక్కువమంది క్షేత్రస్ధాయిలో కన్నా మీడియా సమావేశాల్లోను, టీవీ చర్చల్లో మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతుంటారు. కాబట్టి బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ తమకు బాగా బలముందని చెప్పుకున్న జనసేన కూడా నూరుశాతం చతికిలపడిపోయిందంటే ఏమిటర్ధం ?
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో జనసేనను తిరస్కరించినట్లే జనాలు ఏలూరులో కూడా తిరస్కరించినట్లు అర్ధమైపోతోంది. కాబట్టి జనసేనను రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అన్న తేడాలేకుండా హోలు మొత్తంమీద జనాలు దూరం పెట్టేశారని అర్ధమవుతోంది. మరి ఈ పరిస్ధితుల్లో మిత్రపక్షాలు తమ బంధంపై పునః సమీక్షించుకుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. అసలే రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. దీనిమీద ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది. మరి తాజా ఫలితాలు మిత్రపక్షాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సిందే.
This post was last modified on July 26, 2021 1:41 pm
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…
కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…