Political News

పవన్ సత్తా తేలిపోయిందా ?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తేలిపోయిందా ? తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరిలోను ఇదే సందేహం పెరిగిపోతోంది. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, జనసేనకు ఈ రెండు జిల్లాల్లో మంచి పట్టుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ దెబ్బకు జనసేన తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలుంటే జనసేన గెలిచింది కేవలం ఒకే ఒక నియోజకవర్గం రాజోలులో మాత్రమే. సరే అప్పుడంటే ఏదో అలా జరిగిపోయిందని జనసైనికులు సరిపెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ తడాఖా ఏమిటో చూపుతామని గట్టి సవాళ్ళే చేశారు. మార్చి 10వ తేదీన రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీలకు ఎన్నిక జరిగినట్లే ఏలూరు కార్పొరేషన్ కు కూడా జరిగింది. కాకపోతే ఓటర్ల లిస్టులో అవకతవకలున్నాయనే కారణంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది.

కోర్టులో కేసు పరిష్కారమైన తర్వాత ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 50 డివిజన్లలో 47 చోట్ల వైసీపీ గెలిచింది. మిగిలిన 3 చోట్ల టీడీపీ నెగ్గింది. జనసేన పోటీచేసిన 20 డివిజన్లు+బీజేపీ పోటీచేసిన 16 డివిజన్లలో మిత్రపక్షాలు కనీసం ఒక్క డివిజన్లో కూడా ఎక్కడా గెలవలేదు. నిజానికి ఏలూరులో కాపుల ప్రాబల్యమే చాలా ఎక్కువ. పైగా ఏలూరుపై దృష్టిపెట్టిన పవన్ ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు.

మిత్రపక్షాల్లో బీజేపీకి క్షేత్రస్ధాయిలో పెద్ద బలం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కమలనాదుల్లో ఎక్కువమంది క్షేత్రస్ధాయిలో కన్నా మీడియా సమావేశాల్లోను, టీవీ చర్చల్లో మాత్రమే ఎక్కువగా హైలైట్ అవుతుంటారు. కాబట్టి బీజేపీ అభ్యర్ధులు ఓడిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ తమకు బాగా బలముందని చెప్పుకున్న జనసేన కూడా నూరుశాతం చతికిలపడిపోయిందంటే ఏమిటర్ధం ?

రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో జనసేనను తిరస్కరించినట్లే జనాలు ఏలూరులో కూడా తిరస్కరించినట్లు అర్ధమైపోతోంది. కాబట్టి జనసేనను రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అన్న తేడాలేకుండా హోలు మొత్తంమీద జనాలు దూరం పెట్టేశారని అర్ధమవుతోంది. మరి ఈ పరిస్ధితుల్లో మిత్రపక్షాలు తమ బంధంపై పునః సమీక్షించుకుంటాయనే ప్రచారం పెరిగిపోతోంది. అసలే రెండు పార్టీల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. దీనిమీద ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయ్యింది. మరి తాజా ఫలితాలు మిత్రపక్షాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సిందే.

This post was last modified on July 26, 2021 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

17 minutes ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

51 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

6 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

7 hours ago