Political News

దళిత బంధుపై కేసీఆర్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు మాంచి హీట్ మీద ఉన్నాయి. ఎవరికివారు.. హుజురాబాద్ లో విజయం సాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ వైపు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.

ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న ద‌ళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్‌గా కేసీర్ కామెంట్లు చేశారు. అంద‌రూ అనుకున్న‌ట్టు గానే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోస‌మే పెట్టామ‌ని చెప్ప‌డం పెద్ద దుర‌మం రేపుతోంది. రాజ‌కీయ పార్టీ ఏది చేసినా అది అంతిమంగా ఓట్ల కోస‌మే స్కీములు పెడ‌తామంటూ చెప్ప‌డం పెద్ద వివాదాస్ప‌దంగా మారింది.

సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడ‌టంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సంచ‌ల‌న కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అవ‌కాశం వ‌చ్చిద‌ని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మ‌రీ ఇంత అహంకారం ప‌నికి రాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ అయితే ఇలాంటి అహంకారాన్ని ప్ర‌జ‌లు ఓడగొట్టాలంటే కోరుతున్నారు.

కేసీఆర్ ఇలా ప్రకటించడం బ‌రితెగింపున‌కు నిద‌ర్శ‌నమ‌ని ఈటల మండిప‌డ్డారు. గ‌తంలో GHMC ఎన్నికల్లో కూడా ఇలానే వరదల పేరుతో రూ. 900 కోట్లు ఖర్చు పెట్టార‌ని.. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయ‌న‌ గుర్తు చేశారు. దేశంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఆప‌ద‌ల్లో ఉన్న‌వారికి నేరుగా డ‌బ్బులు చెల్లించ‌ద‌ని.. చెక్కుల రూపంలోనే ఇస్తుంద‌న్న ఈట‌ల‌.. కేసీఆర్ మాత్రం నేరుగా డ‌బ్బులే పంచిపెట్టార‌ని విమ‌ర్శించారు.

This post was last modified on July 22, 2021 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

9 hours ago