Political News

దళిత బంధుపై కేసీఆర్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు

తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికలు మాంచి హీట్ మీద ఉన్నాయి. ఎవరికివారు.. హుజురాబాద్ లో విజయం సాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ వైపు ఈటల పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.

ఎన్నో అనుమానాలు లేవ నెత్తుత్తున్న ద‌ళిత బంధుపై స్కీమ్ పై ఓపెన్‌గా కేసీర్ కామెంట్లు చేశారు. అంద‌రూ అనుకున్న‌ట్టు గానే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోస‌మే పెట్టామ‌ని చెప్ప‌డం పెద్ద దుర‌మం రేపుతోంది. రాజ‌కీయ పార్టీ ఏది చేసినా అది అంతిమంగా ఓట్ల కోస‌మే స్కీములు పెడ‌తామంటూ చెప్ప‌డం పెద్ద వివాదాస్ప‌దంగా మారింది.

సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడ‌టంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సంచ‌ల‌న కామెంట్లు చేస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అవ‌కాశం వ‌చ్చిద‌ని ప్ర‌తిప‌క్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మ‌రీ ఇంత అహంకారం ప‌నికి రాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ అయితే ఇలాంటి అహంకారాన్ని ప్ర‌జ‌లు ఓడగొట్టాలంటే కోరుతున్నారు.

కేసీఆర్ ఇలా ప్రకటించడం బ‌రితెగింపున‌కు నిద‌ర్శ‌నమ‌ని ఈటల మండిప‌డ్డారు. గ‌తంలో GHMC ఎన్నికల్లో కూడా ఇలానే వరదల పేరుతో రూ. 900 కోట్లు ఖర్చు పెట్టార‌ని.. కానీ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని ఆయ‌న‌ గుర్తు చేశారు. దేశంలో ఏ ప్ర‌భుత్వం కూడా ఆప‌ద‌ల్లో ఉన్న‌వారికి నేరుగా డ‌బ్బులు చెల్లించ‌ద‌ని.. చెక్కుల రూపంలోనే ఇస్తుంద‌న్న ఈట‌ల‌.. కేసీఆర్ మాత్రం నేరుగా డ‌బ్బులే పంచిపెట్టార‌ని విమ‌ర్శించారు.

This post was last modified on July 22, 2021 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago