Political News

కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవ‌ల ఆ మ‌హిళ భ‌ర్త క‌రోనా బారిన ప‌డి వ‌డోద‌రాలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మార‌టంతో డాక్ట‌ర్లు కూడా చేతులెత్తేసే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. త‌న అవ‌య‌వాల‌న్ని దెబ్బ‌తిన్నాయ‌ని డాక్ట‌ర్లే ధృవీక‌రిస్తున్నారు.

దీంతో త‌మ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాల‌ని ఆలోచించిన ఆ మ‌హిళ… త‌న భ‌ర్త నుండి సేక‌రించిన వీర్యంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తితో త‌ల్లి కావాల‌ని భావించింది. కానీ క‌రోనా బాధితుడి నుండి వీర్యం సేక‌రించేందుకు ఆసుప‌త్రి వ‌ర్గాలు అనుమ‌తి నిరాక‌రించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామ‌ని తెలిపాయి. దీంతో ఆ మ‌హిళ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించింది.

కోర్టు కూడా ఆ మ‌హిళ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంట‌నే వీర్యం సేక‌రించి భ‌ద్ర‌ప‌ర్చాల‌ని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గ‌ర్భం దాల్చేందుకు అత‌డి భార్య‌కు అందించి స‌హ‌క‌రించాల‌ని తెలిపింది.

This post was last modified on July 21, 2021 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

29 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago