Political News

కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవ‌ల ఆ మ‌హిళ భ‌ర్త క‌రోనా బారిన ప‌డి వ‌డోద‌రాలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మార‌టంతో డాక్ట‌ర్లు కూడా చేతులెత్తేసే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. త‌న అవ‌య‌వాల‌న్ని దెబ్బ‌తిన్నాయ‌ని డాక్ట‌ర్లే ధృవీక‌రిస్తున్నారు.

దీంతో త‌మ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాల‌ని ఆలోచించిన ఆ మ‌హిళ… త‌న భ‌ర్త నుండి సేక‌రించిన వీర్యంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తితో త‌ల్లి కావాల‌ని భావించింది. కానీ క‌రోనా బాధితుడి నుండి వీర్యం సేక‌రించేందుకు ఆసుప‌త్రి వ‌ర్గాలు అనుమ‌తి నిరాక‌రించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామ‌ని తెలిపాయి. దీంతో ఆ మ‌హిళ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించింది.

కోర్టు కూడా ఆ మ‌హిళ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంట‌నే వీర్యం సేక‌రించి భ‌ద్ర‌ప‌ర్చాల‌ని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గ‌ర్భం దాల్చేందుకు అత‌డి భార్య‌కు అందించి స‌హ‌క‌రించాల‌ని తెలిపింది.

This post was last modified on July 21, 2021 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

8 hours ago