కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడి వడోదరాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చేసింది. తన అవయవాలన్ని దెబ్బతిన్నాయని డాక్టర్లే ధృవీకరిస్తున్నారు.
దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాలని ఆలోచించిన ఆ మహిళ… తన భర్త నుండి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్ధతితో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుండి వీర్యం సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతి నిరాకరించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంటనే వీర్యం సేకరించి భద్రపర్చాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు అందించి సహకరించాలని తెలిపింది.
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…