Political News

కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవ‌ల ఆ మ‌హిళ భ‌ర్త క‌రోనా బారిన ప‌డి వ‌డోద‌రాలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మార‌టంతో డాక్ట‌ర్లు కూడా చేతులెత్తేసే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. త‌న అవ‌య‌వాల‌న్ని దెబ్బ‌తిన్నాయ‌ని డాక్ట‌ర్లే ధృవీక‌రిస్తున్నారు.

దీంతో త‌మ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాల‌ని ఆలోచించిన ఆ మ‌హిళ… త‌న భ‌ర్త నుండి సేక‌రించిన వీర్యంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తితో త‌ల్లి కావాల‌ని భావించింది. కానీ క‌రోనా బాధితుడి నుండి వీర్యం సేక‌రించేందుకు ఆసుప‌త్రి వ‌ర్గాలు అనుమ‌తి నిరాక‌రించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామ‌ని తెలిపాయి. దీంతో ఆ మ‌హిళ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించింది.

కోర్టు కూడా ఆ మ‌హిళ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంట‌నే వీర్యం సేక‌రించి భ‌ద్ర‌ప‌ర్చాల‌ని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గ‌ర్భం దాల్చేందుకు అత‌డి భార్య‌కు అందించి స‌హ‌క‌రించాల‌ని తెలిపింది.

This post was last modified on July 21, 2021 9:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

8 minutes ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

1 hour ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

6 hours ago