కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడి వడోదరాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చేసింది. తన అవయవాలన్ని దెబ్బతిన్నాయని డాక్టర్లే ధృవీకరిస్తున్నారు.
దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాలని ఆలోచించిన ఆ మహిళ… తన భర్త నుండి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్ధతితో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుండి వీర్యం సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతి నిరాకరించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంటనే వీర్యం సేకరించి భద్రపర్చాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు అందించి సహకరించాలని తెలిపింది.
This post was last modified on July 21, 2021 9:34 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…