కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా బారిన పడి వడోదరాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో డాక్టర్లు కూడా చేతులెత్తేసే పరిస్థితికి వచ్చేసింది. తన అవయవాలన్ని దెబ్బతిన్నాయని డాక్టర్లే ధృవీకరిస్తున్నారు.
దీంతో తమ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాలని ఆలోచించిన ఆ మహిళ… తన భర్త నుండి సేకరించిన వీర్యంతో ఐవీఎఫ్ పద్ధతితో తల్లి కావాలని భావించింది. కానీ కరోనా బాధితుడి నుండి వీర్యం సేకరించేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతి నిరాకరించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామని తెలిపాయి. దీంతో ఆ మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంటనే వీర్యం సేకరించి భద్రపర్చాలని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు అతడి భార్యకు అందించి సహకరించాలని తెలిపింది.
This post was last modified on July 21, 2021 9:34 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…