ప్రజల కోసమే తన జీవితమని.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించి రెండేళ్ల పాటు జనసేనను ప్రజల్లో పరుగులు పెట్టించిన జనసేనాని పవన్ కళ్యాణ్కు ఇప్పుడు రాజకీయాలు చేసే టైం లేదా? పూర్తిగా సినిమాలతోనే బిజీ అయిపోయారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఇప్పుడు వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రాజకీయాల్లో ఎదిగేది ఎప్పుడనే మాటలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల కోసం సినిమాలు వదిలేశానని గతంలో చెప్పిన పవన్ ఆ తర్వాత తనకేమైనా ఆస్తులు ఉన్నయా? సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయని మాట మార్చి మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికొదిలేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన చేతిలో దాదాపు అయిదు సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేసేసరికి 2023 గడిచిపోతుంది. 2024లో మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు ఆయన పార్టీని ఎలా సిద్ధం చేస్తారు? తాను ఎలా సిద్ధమవుతారు? అనేవి జవాబు లేని ప్రశ్నల్లాగే మిగిలిపోనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2018లో అఙాతవాసి తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న పవన్ గతేడాది వకీల్సాబ్ షూటింగ్ కోసం మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ ఏడాది విడుదలైన ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో జోరు మీదున్న ఆయన వరుస సినిమాలు చేయడం మొదలెట్టారు. ప్రస్తుతం మళయాల రీమేక్ అయ్యప్పనుమ్ కోశియమ్ చేస్తున్న ఆయన దీని తర్వాత క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లును పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హరీశ్ శంకర్తో పాటు మరో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని సినిమాలకు అడ్వాన్స్లు కూడా తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూసుకుంటే 2023 వరకూ పవన్ ఫుల్ బిజీగా ఉండనున్నట్లే లెక్క.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై వేచి చూసే ధోరణి అవలంబించిన పవన్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటం చేసేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేనను ఏ విధంగా ముందుకు నడిపిస్తారో చూడాలి.
This post was last modified on July 17, 2021 4:00 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…