కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం.
కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం.
ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు.
‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on July 16, 2021 3:17 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…