కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైరవీలు చేశారు. ఆస్తులు, పుస్తెలమ్మి కూడా ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టారు. కొన్ని చోట్ల అయితే కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
అయితే, కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చిన కేసులు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని… ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని, అందుకే థర్డ్ వేవ్ వస్తున్న దేశాల్లో మరణాల శాతంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని డా.గులేరియా వివరించారు. థర్డ్ వేవ్ రాకముందే జనం టీకాలు తీసుకోవటం మంచిదని సూచించారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…