కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైరవీలు చేశారు. ఆస్తులు, పుస్తెలమ్మి కూడా ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టారు. కొన్ని చోట్ల అయితే కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
అయితే, కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చిన కేసులు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని… ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని, అందుకే థర్డ్ వేవ్ వస్తున్న దేశాల్లో మరణాల శాతంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని డా.గులేరియా వివరించారు. థర్డ్ వేవ్ రాకముందే జనం టీకాలు తీసుకోవటం మంచిదని సూచించారు.
This post was last modified on July 16, 2021 3:03 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…