కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైరవీలు చేశారు. ఆస్తులు, పుస్తెలమ్మి కూడా ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టారు. కొన్ని చోట్ల అయితే కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
అయితే, కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చిన కేసులు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని… ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని, అందుకే థర్డ్ వేవ్ వస్తున్న దేశాల్లో మరణాల శాతంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని డా.గులేరియా వివరించారు. థర్డ్ వేవ్ రాకముందే జనం టీకాలు తీసుకోవటం మంచిదని సూచించారు.
This post was last modified on July 16, 2021 3:03 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…