కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ అందక, రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైరవీలు చేశారు. ఆస్తులు, పుస్తెలమ్మి కూడా ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టారు. కొన్ని చోట్ల అయితే కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు కూడా క్యూలైన్లు దర్శనమిచ్చాయి.
అయితే, కరోనా థర్డ్ వేవ్ వస్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్షలను సడలిస్తున్నారని… కానీ ఆంక్షల సడలింపులో ఏమాత్రం తేడా వచ్చిన కేసులు పెరుగుతాయన్నారు.
ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని… ఆంక్షలు సడలించటం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. అదే జరిగితే థర్డ్ వేవ్ భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని, అందుకే థర్డ్ వేవ్ వస్తున్న దేశాల్లో మరణాల శాతంతో పాటు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని డా.గులేరియా వివరించారు. థర్డ్ వేవ్ రాకముందే జనం టీకాలు తీసుకోవటం మంచిదని సూచించారు.
This post was last modified on July 16, 2021 3:03 pm
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…