తెలంగాణ పీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో డైనమిక్ రాజకీయాలు చేసే సంగతి తెలిసిందే. దూకుడుకు మారుపేరైన రేవంత్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందు అంతర్గత రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు పార్టీ నేతలపై నజర్ పెట్టారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా ఇంటి దొంగలకు వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.
అధికార పార్టీకి కౌశిక్ దగ్గరగా ఉంటున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతుండగా తాజాగా లీక్ అయిన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఆయనే స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా… “యూత్ను సమీకరించండి. డబ్బులు ఇద్దాం.. మీకు నేను అండగా ఉంటా”.. అంటూ ఆయన మాట్లాడినట్టు ఉన్న టేపులు వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం.. కౌశిక్కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ ప్రకటించింది.
ఈ సస్పెన్షన్ అనంతరం తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోని ఇంటి దొంగలకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. “కాంగ్రెస్ ఇంటి దొంగలకు నెలాఖరు వరకు డెడ్లైన్. ఇంటి దొంగలను వదిలిపెట్టేది లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాడు ఉంటే వదులుకునేది లేదు. పార్టీ కోసం కష్టపడేవాళ్లను గుండెల్లో చేర్చుకుని, దగ్గర పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది. కానీ, ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరారు అవ్వాలి” అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అయినట్టు అనుమానిస్తున్న రేవంత్ రెడ్డి ఈ మేరకు వారిపై దండయాత్ర మొదలుపెట్టినట్లు చెప్తున్నారు.
This post was last modified on July 13, 2021 7:41 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…