చాలా ఇంట్రస్టింగ్ డెవలప్మెంటే ఇది. ఏ రాజకీయపార్టీ తరపున తాను పనిచేసేది లేదని స్పష్టంగా చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) మళ్ళీ యాక్టివ్ అయినట్లు సమాచారం. షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ టీపీ తరపున పీకే యాక్టివ్ అయ్యారట. కాకపోతే ప్రత్యక్షంగా తాను క్షేత్రస్ధాయిలో తిరగకపోయినా పర్యవేక్షణ, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారట. గురువారం పార్టీ లాంచింగ్ కు ముందురోజంతా పీకే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంట్లోనే ఉన్నారని సమాచరం.
లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి దగ్గరలోనే పీకే టీముకు షర్మిల ఓ కార్యాలయాన్ని కేటాయించారు. పీకే బృందంలోని కీలక సభ్యురాలు ప్రియ నేతృత్వంలోనే ప్రస్తుత టీమ్ షర్మిల పార్టీ తరపున పనిచేస్తున్నది. గడచిన మూడు నెలలుగా ఇదే టీమ్ తెలంగాణాలోని టీఆర్ఎస్ తో కలిసి వివిధ రాజకీయపార్టీల పరిస్ధితి ఏమిటనే విషయమై చాలా డీటైల్డ్ గా సర్వే చేసిందట.
ప్రభుత్వం నుండి జనాల ఏమి కోరుకుంటున్నారు ? ప్రస్తుత కేసీయార్ సర్కార్ జనాల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందా ? టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏమిటి ? అనే అంశాలపై సర్వే జరిగిందట. సర్వే వివరాలను ప్రియా బృందం పీకేకు వివరించినట్లు సమాచారం. మొత్తంమీద చాలాసేపు ప్రియా టీమ్ తో పీకే సుదీర్ఘంగా సమావేశం అయ్యారట. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే అయినా షర్మిలకు పీకే సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అర్ధమవుతోంది.
This post was last modified on July 10, 2021 5:35 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…