చాలా ఇంట్రస్టింగ్ డెవలప్మెంటే ఇది. ఏ రాజకీయపార్టీ తరపున తాను పనిచేసేది లేదని స్పష్టంగా చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) మళ్ళీ యాక్టివ్ అయినట్లు సమాచారం. షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ టీపీ తరపున పీకే యాక్టివ్ అయ్యారట. కాకపోతే ప్రత్యక్షంగా తాను క్షేత్రస్ధాయిలో తిరగకపోయినా పర్యవేక్షణ, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారట. గురువారం పార్టీ లాంచింగ్ కు ముందురోజంతా పీకే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంట్లోనే ఉన్నారని సమాచరం.
లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి దగ్గరలోనే పీకే టీముకు షర్మిల ఓ కార్యాలయాన్ని కేటాయించారు. పీకే బృందంలోని కీలక సభ్యురాలు ప్రియ నేతృత్వంలోనే ప్రస్తుత టీమ్ షర్మిల పార్టీ తరపున పనిచేస్తున్నది. గడచిన మూడు నెలలుగా ఇదే టీమ్ తెలంగాణాలోని టీఆర్ఎస్ తో కలిసి వివిధ రాజకీయపార్టీల పరిస్ధితి ఏమిటనే విషయమై చాలా డీటైల్డ్ గా సర్వే చేసిందట.
ప్రభుత్వం నుండి జనాల ఏమి కోరుకుంటున్నారు ? ప్రస్తుత కేసీయార్ సర్కార్ జనాల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందా ? టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏమిటి ? అనే అంశాలపై సర్వే జరిగిందట. సర్వే వివరాలను ప్రియా బృందం పీకేకు వివరించినట్లు సమాచారం. మొత్తంమీద చాలాసేపు ప్రియా టీమ్ తో పీకే సుదీర్ఘంగా సమావేశం అయ్యారట. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే అయినా షర్మిలకు పీకే సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అర్ధమవుతోంది.
This post was last modified on July 10, 2021 5:35 pm
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…