చాలా ఇంట్రస్టింగ్ డెవలప్మెంటే ఇది. ఏ రాజకీయపార్టీ తరపున తాను పనిచేసేది లేదని స్పష్టంగా చెప్పేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) మళ్ళీ యాక్టివ్ అయినట్లు సమాచారం. షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటైన వైఎస్సార్ టీపీ తరపున పీకే యాక్టివ్ అయ్యారట. కాకపోతే ప్రత్యక్షంగా తాను క్షేత్రస్ధాయిలో తిరగకపోయినా పర్యవేక్షణ, ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారట. గురువారం పార్టీ లాంచింగ్ కు ముందురోజంతా పీకే లోటస్ పాండ్ లోని షర్మిల ఇంట్లోనే ఉన్నారని సమాచరం.
లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి దగ్గరలోనే పీకే టీముకు షర్మిల ఓ కార్యాలయాన్ని కేటాయించారు. పీకే బృందంలోని కీలక సభ్యురాలు ప్రియ నేతృత్వంలోనే ప్రస్తుత టీమ్ షర్మిల పార్టీ తరపున పనిచేస్తున్నది. గడచిన మూడు నెలలుగా ఇదే టీమ్ తెలంగాణాలోని టీఆర్ఎస్ తో కలిసి వివిధ రాజకీయపార్టీల పరిస్ధితి ఏమిటనే విషయమై చాలా డీటైల్డ్ గా సర్వే చేసిందట.
ప్రభుత్వం నుండి జనాల ఏమి కోరుకుంటున్నారు ? ప్రస్తుత కేసీయార్ సర్కార్ జనాల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందా ? టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఏమిటి ? అనే అంశాలపై సర్వే జరిగిందట. సర్వే వివరాలను ప్రియా బృందం పీకేకు వివరించినట్లు సమాచారం. మొత్తంమీద చాలాసేపు ప్రియా టీమ్ తో పీకే సుదీర్ఘంగా సమావేశం అయ్యారట. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే అయినా షర్మిలకు పీకే సహాయ సహకారాలు అందిస్తున్నట్లు అర్ధమవుతోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ మేకపాటి కుటుంబంలో ఆస్తుల రచ్చ రోడ్డుకెక్కింది. ఈ కుటుంబం నుంచి పలువురు నాయకులు…
ఈ మధ్య తమన్ సౌండ్ కొంచెం తగ్గిపోయింది. తన నుంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అభిమానులు ఎదురు చూస్తున్నారు.…
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి అప్పుడే రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకో రెండున్నరేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా…
సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో…
తన కెరీర్లో ఇంకే చిత్రానికీ పడనంత కష్టాన్ని ‘పెద్ది’ సినిమా కోసం పడ్డాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.…
జాతీయ రాజకీయాలకు సంబంధించి సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ కీలక సమావేశం జరుగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఏర్పాటు…