గత 24 గంటల్లో కరోనా వేగం కొంతవరకు తగ్గినా కేసుల పెరుగుదల మాత్రం నమోదైంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 314 కి పెరిగింది. గుంటూరులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక్క కేసు నమోదైంది. మునుపటి రోజులతో పోలిస్తే కేసులు తక్కువ నమోదైనా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి టెస్టులు చేస్తున్నదీ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
ఇక తెలంగాణలో ఒక్క రోజులో 40 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 404 కి పెరిగింది. ఈరోజుతో కలిపి మొత్తం 45 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. 348 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి తెలంగాణ రెండో దశలోనే ఉంది. ఇదిలా ఉండగా… గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. అందులో 1500 బెడ్లు ఏర్పాటుచేశారు.
ఇండియా మొత్తం మీద 508 కొత్త కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో ఎక్కువ కేసులు కనిపించాయి. కోలుకున్న వారు, మరణించి వారు మినహాయిస్తే 4312 కేసులు ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల మూడో దశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
జైలర్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు ఏ స్థాయిలో సౌత్ మొత్తం మారుమ్రోగిపోయిందో అభిమానులు అంత సులభంగా…
మొన్నటిదాకా ఒక చిన్న సినిమా ప్రపంచ సినీ ప్రియులను ఊపేయడం అబ్సెషన్ విషయంలోనే జరిగింది. అతి తక్కువ బడ్జెట్ తో…
ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదు మరోదారి అన్నట్టుగా వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన అనంతరం.. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు…
తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొన్ని రోజులుగా ప్రశ్న రావణ్ కు సంబంధించిన అంశాలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.…
చిన్న సినిమాల మీద జనాల్లో ఆసక్తి పెంచేందుకు, వాళ్లను థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ తమ చిత్రాల గురించి కొంచెం ఎక్కువ…
ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఎవరో రావాలి.. ఏదో చెప్పాలి.. అని ఎదురు చూడకుండా.. ప్రజల…