గత 24 గంటల్లో కరోనా వేగం కొంతవరకు తగ్గినా కేసుల పెరుగుదల మాత్రం నమోదైంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 314 కి పెరిగింది. గుంటూరులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక్క కేసు నమోదైంది. మునుపటి రోజులతో పోలిస్తే కేసులు తక్కువ నమోదైనా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి టెస్టులు చేస్తున్నదీ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
ఇక తెలంగాణలో ఒక్క రోజులో 40 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 404 కి పెరిగింది. ఈరోజుతో కలిపి మొత్తం 45 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. 348 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి తెలంగాణ రెండో దశలోనే ఉంది. ఇదిలా ఉండగా… గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. అందులో 1500 బెడ్లు ఏర్పాటుచేశారు.
ఇండియా మొత్తం మీద 508 కొత్త కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో ఎక్కువ కేసులు కనిపించాయి. కోలుకున్న వారు, మరణించి వారు మినహాయిస్తే 4312 కేసులు ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల మూడో దశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 9, 2020 6:53 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…