గత 24 గంటల్లో కరోనా వేగం కొంతవరకు తగ్గినా కేసుల పెరుగుదల మాత్రం నమోదైంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 314 కి పెరిగింది. గుంటూరులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక్క కేసు నమోదైంది. మునుపటి రోజులతో పోలిస్తే కేసులు తక్కువ నమోదైనా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి టెస్టులు చేస్తున్నదీ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
ఇక తెలంగాణలో ఒక్క రోజులో 40 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 404 కి పెరిగింది. ఈరోజుతో కలిపి మొత్తం 45 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. 348 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి తెలంగాణ రెండో దశలోనే ఉంది. ఇదిలా ఉండగా… గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. అందులో 1500 బెడ్లు ఏర్పాటుచేశారు.
ఇండియా మొత్తం మీద 508 కొత్త కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో ఎక్కువ కేసులు కనిపించాయి. కోలుకున్న వారు, మరణించి వారు మినహాయిస్తే 4312 కేసులు ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల మూడో దశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 9, 2020 6:53 pm
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…
గత రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేస్తోంది ‘దురంధర్-2’ సినిమా. దేశ విదేశాల్లో ఈ సినిమా ప్రభంజనం మామూలుగా…
గతంలో నెల మారుతున్నా.. ఏడాది మారుతున్నా నిబంధనల్లో మార్పులు పెద్దగా ఉండేవి కావు. ఇటీవల కాలంలో ఆ తీరులో పెను…
ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ…
జనవరి సంక్రాంతి పండక్కు రావాల్సిన జన నాయకుడు వాయిదా పడి మూడు నెలలు గడిచిపోయాయి. ఒక స్టార్ హీరో సినిమా…