నరేంద్రమోడి దృష్టిలో ఏపి మరీ అన్యాయమైపోయినట్లుంది. లేకపోతే తమిళనాడు పార్టీ చీఫ్ ఎల్. మురుగన్ కు కేంద్రమంత్రిమండలిలో చోటు కల్పించిన మోడి ఏపి విషయాన్ని పూర్తిగా ఎందుకు వదిలేస్తారు ? బీజేపీకి సంబంధించి తమిళనాడు కన్నా ఏపినే కాస్త మెరుగనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ గాలి బలంగా వీచినపుడు ఏపిలో ఒకటో రెండో ఎంపి సీట్లలో గెలిచిన చరిత్ర కమలంపార్టీకుంది. తమిళనాడులో అసలు బోణీనే కొట్టలేదు దశాబ్దాల పాటు.
ఇపుడు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మురుగన్ కూడా తమిళనాడు పార్టీ చీఫ్ మాత్రమే. లోక్ సభ కాదు కదా కనీసం రాజ్యసభ ఎంపి కూడా కాదు. ఏ సభలోను ఎంపిగా కూడా కనీ మురుగన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాబట్టి తొందరలోనే ఏదో రాష్ట్రం నుండి మురుగన్ను రాజ్యసభకు పంపాల్సుంటుంది. అసలు ఎంపినే కాని వ్యక్తిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న మోడి పార్టీలో ఐదుగురు తెలుగు వాళ్ళు రాజ్యసభ ఎంపిలుగా ఉన్నా ఎందుకని తీసుకోలేదు ?
2019 ఎన్నికల ఫలితాలు రాగానే మోడి సర్కార్ మరింత మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. వీరిలో గరికపాటి మోహన్ రావు తెలంగాణా వ్యక్తయితే మిగిలిన ముగ్గురు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఏపికి చెందిన వారే.
ఒకవేళ వీళ్ళల్లో ఎవరు పనికిరారని అనుకున్నా ఉత్తర ప్రదేశ్ నుండి ఎంపికైన తెలుగు నేత జీవీఎల్ నరసింహారావు ఉండనే ఉన్నారు. ఏపి నుండి మంత్రివర్గంలోకి తీసుకోవటానికి ఇంత అవకాశం ఉండి కూడా ఎవరినీ తీసుకోలేదంటే మోడి దృష్టిలో ఏపి జీరో అనే అర్ధమైపోతోంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకున్నా లేదా ఎవరినీ తీసుకోకపోయినా బీజేపీకి వచ్చే లాభమూ లేదు కొత్తగా రాబోయే నష్టమూ లేదని మోడికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే మోడి ఏపిని పూర్తిగా పక్కన పెట్టేశారు.
This post was last modified on July 8, 2021 4:38 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…