Political News

రంగనాయకమ్మకు ఎన్ని గంటల విచారణ అంటే?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? గుంటూరులో జరిగిన సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది. విశాఖ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును చూసి.. సరిగా చెక్ చేసుకోకుండా.. ముందు వెనుకా ఆలోచించకుండా పోస్టు చేసిన 67 ఏళ్ల పెద్ద వయస్కురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయటాన్ని తప్పు పట్టిన అధికారులు.. తాజాగా ఆమెను విచారించారు. ఆమె పెట్టిన తాజా పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ.. సీఐడీ అధికారులు ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. గురువారం మధ్యాహ్నం 12.19 గంటలకు మొదలైన విచారణ దాదాపు 150 నిమిషాలకు పైనే సాగినట్లు చెబుతున్నారు.

విచారణలో భాగంగా ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణలో రంగనాయకమ్మ చెప్పిన సమాధానాల్లో అత్యధికంగా తనకు అవగాహన లేకపోవటం.. తెలీదన్న మాటతోపాటు.. దుర్ఘటన తీవ్రత నేపథ్యంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.

టీవీల్లో ఘటన తీవ్రత చూశానని.. దట్టమైన పొగలు వ్యాపించటం.. సమీప గ్రామాల ప్రజలు గ్యాస్ లీకేజీతో ఉక్కిరిబిక్కిరి కావటం చూసి తీవ్రమైనదిగా తాను భావించినట్లుగా ఆమె చెప్పారంటున్నారు. రంగనాయకమ్మ ఫేస్ బుక్ ఖాతాలో ఆమెను అనుసరించేవారు 120 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలోనూ ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ప్రభుత్వ పథకాల అమలును తప్పు పడుతూ పోస్టులు పెట్టిన వైనంపైనా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని తప్పు పట్టేలా ఉన్న పోస్టుల్ని వ్యక్తిగత అభిప్రాయంగా ఎలా చెబుతారన్న ప్రశ్నను ఆమెకు వేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. అమ్మఒడి.. రైతుభరోసా.. వాహనమిత్ర పథకాల్ని తప్పు పడుతూ పోస్టుల్ని గతంలో ఆమె పెట్టారని.. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ పథకం రద్దు చేస్తామని చెప్పి.. వారి జీతాల్లో 50 శాతం కోత విధించినట్లు ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.

తనను తాను సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పుకున్న రంగనాయకమ్మ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు చెప్పుకోలేకపోయారంటూ సీఐడీ విడుదల చేసిన ప్రకటనలో ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రంగనాయకమ్మ పెట్టిన ఒక పోస్టు ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది తాజా విచారణ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

This post was last modified on May 22, 2020 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

35 minutes ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

1 hour ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

1 hour ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

2 hours ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

3 hours ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

4 hours ago