చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? గుంటూరులో జరిగిన సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది. విశాఖ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును చూసి.. సరిగా చెక్ చేసుకోకుండా.. ముందు వెనుకా ఆలోచించకుండా పోస్టు చేసిన 67 ఏళ్ల పెద్ద వయస్కురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయటాన్ని తప్పు పట్టిన అధికారులు.. తాజాగా ఆమెను విచారించారు. ఆమె పెట్టిన తాజా పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ.. సీఐడీ అధికారులు ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. గురువారం మధ్యాహ్నం 12.19 గంటలకు మొదలైన విచారణ దాదాపు 150 నిమిషాలకు పైనే సాగినట్లు చెబుతున్నారు.
విచారణలో భాగంగా ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణలో రంగనాయకమ్మ చెప్పిన సమాధానాల్లో అత్యధికంగా తనకు అవగాహన లేకపోవటం.. తెలీదన్న మాటతోపాటు.. దుర్ఘటన తీవ్రత నేపథ్యంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.
టీవీల్లో ఘటన తీవ్రత చూశానని.. దట్టమైన పొగలు వ్యాపించటం.. సమీప గ్రామాల ప్రజలు గ్యాస్ లీకేజీతో ఉక్కిరిబిక్కిరి కావటం చూసి తీవ్రమైనదిగా తాను భావించినట్లుగా ఆమె చెప్పారంటున్నారు. రంగనాయకమ్మ ఫేస్ బుక్ ఖాతాలో ఆమెను అనుసరించేవారు 120 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.
గతంలోనూ ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ప్రభుత్వ పథకాల అమలును తప్పు పడుతూ పోస్టులు పెట్టిన వైనంపైనా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని తప్పు పట్టేలా ఉన్న పోస్టుల్ని వ్యక్తిగత అభిప్రాయంగా ఎలా చెబుతారన్న ప్రశ్నను ఆమెకు వేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. అమ్మఒడి.. రైతుభరోసా.. వాహనమిత్ర పథకాల్ని తప్పు పడుతూ పోస్టుల్ని గతంలో ఆమె పెట్టారని.. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ పథకం రద్దు చేస్తామని చెప్పి.. వారి జీతాల్లో 50 శాతం కోత విధించినట్లు ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.
తనను తాను సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పుకున్న రంగనాయకమ్మ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు చెప్పుకోలేకపోయారంటూ సీఐడీ విడుదల చేసిన ప్రకటనలో ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రంగనాయకమ్మ పెట్టిన ఒక పోస్టు ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది తాజా విచారణ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
This post was last modified on May 22, 2020 12:50 pm
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…
తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…