Political News

రంగనాయకమ్మకు ఎన్ని గంటల విచారణ అంటే?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? గుంటూరులో జరిగిన సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది. విశాఖ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును చూసి.. సరిగా చెక్ చేసుకోకుండా.. ముందు వెనుకా ఆలోచించకుండా పోస్టు చేసిన 67 ఏళ్ల పెద్ద వయస్కురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయటాన్ని తప్పు పట్టిన అధికారులు.. తాజాగా ఆమెను విచారించారు. ఆమె పెట్టిన తాజా పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ.. సీఐడీ అధికారులు ఆమెను రెండున్నర గంటల పాటు విచారించారు. గురువారం మధ్యాహ్నం 12.19 గంటలకు మొదలైన విచారణ దాదాపు 150 నిమిషాలకు పైనే సాగినట్లు చెబుతున్నారు.

విచారణలో భాగంగా ఇరవైకి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. విచారణలో రంగనాయకమ్మ చెప్పిన సమాధానాల్లో అత్యధికంగా తనకు అవగాహన లేకపోవటం.. తెలీదన్న మాటతోపాటు.. దుర్ఘటన తీవ్రత నేపథ్యంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు.

టీవీల్లో ఘటన తీవ్రత చూశానని.. దట్టమైన పొగలు వ్యాపించటం.. సమీప గ్రామాల ప్రజలు గ్యాస్ లీకేజీతో ఉక్కిరిబిక్కిరి కావటం చూసి తీవ్రమైనదిగా తాను భావించినట్లుగా ఆమె చెప్పారంటున్నారు. రంగనాయకమ్మ ఫేస్ బుక్ ఖాతాలో ఆమెను అనుసరించేవారు 120 మంది వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలోనూ ఆమె ఫేస్ బుక్ ఖాతాలో ప్రభుత్వ పథకాల అమలును తప్పు పడుతూ పోస్టులు పెట్టిన వైనంపైనా ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల్ని తప్పు పట్టేలా ఉన్న పోస్టుల్ని వ్యక్తిగత అభిప్రాయంగా ఎలా చెబుతారన్న ప్రశ్నను ఆమెకు వేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. అమ్మఒడి.. రైతుభరోసా.. వాహనమిత్ర పథకాల్ని తప్పు పడుతూ పోస్టుల్ని గతంలో ఆమె పెట్టారని.. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ పథకం రద్దు చేస్తామని చెప్పి.. వారి జీతాల్లో 50 శాతం కోత విధించినట్లు ఎద్దేవా చేశారని పేర్కొన్నారు.

తనను తాను సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పుకున్న రంగనాయకమ్మ.. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టటానికి సరైన కారణాలు చెప్పుకోలేకపోయారంటూ సీఐడీ విడుదల చేసిన ప్రకటనలో ఉండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. రంగనాయకమ్మ పెట్టిన ఒక పోస్టు ఆమె ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది తాజా విచారణ ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

This post was last modified on May 22, 2020 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

1 hour ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

2 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

3 hours ago

‘పవన్ పదవి వదిలి గుడులూ.. గోపురాల చుట్టూ తిరగొచ్చు’

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ డిమాండ్…

3 hours ago

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

3 hours ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

4 hours ago