Political News

బయటకొస్తున్న జగన్

చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోని వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకే జగన్ పరిమితమైపోయిన విషయం తెలిసిందే. గడచిన ఏడాదిన్నరలో ఎంతో అవసరమైతే తప్ప జగన్ బయటకు రాలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాధం లాంటి ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి బయటకొచ్చారు.

అలాంటిది ఈనెల 7, 8 తేదీల్లో కడప, అనంతపురం జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. రెండు జిల్లాల్లోను శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. పనిలో పనిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలతో ఎలాగూ సమావేశాలుంటాయి. ఈ రెండు జిల్లాల పర్యటనల తర్వాత గోదావరి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ జిల్లాల పర్యటన ఇలాగుండగానే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. తొందరలోనే విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా జగన్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వచ్చే నెలలో ఉత్తరాంధ్ర పర్యటనపై సర్వత్రా ఆసక్తి పెరిగిపోతోంది.

కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందనే కారణంగానే జగన్ జిల్లాల పర్యటనలకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు క్యాంపు ఆఫీసు నుండే కరోనా వైరస్ పై జగన్ ప్రతిరోజు సమీక్షలు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో కలెక్టర్లతోనే కాకుండా బాధిత కుటుంబాలను కూడా నేరుగా కలవనున్నట్లు సమాచారం. మొత్తంమీద జగన్ జిల్లాల పర్యటనలపై ఆసక్తి పెరిగిపోతోంది.

Satya

Recent Posts

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

28 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

1 hour ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago

వదిలేయడమే అఖిల్ చేసుకున్న అదృష్టం

లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…

2 hours ago

వివేకాను చంపించింది జగనే: లోకేశ్

ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…

4 hours ago

రుక్మిణి వసంత్… ఇంకో మెగా మూవీలో?

‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…

4 hours ago