భారత షట్లర్ సైనా నెహ్వాల్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్వీట్ చేసి..సైనా నెహ్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు.. సైనా ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ మ్యాటరేంటంటే… జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
‘సర్కారీ షట్లర్’ (ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఆమెను విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడంలో బీజేపీ నైపుణ్యాన్ని ఈ ‘సర్కారీ షట్లర్’ గుర్తించారని సెటైర్లు వేశారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండడంపై ఓటర్లు ‘డ్రాప్ షాట్’ (బ్యాడ్మింటన్ లో ఓ రకమైన షాట్) ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి చురకలు వేశారు.
అటు తమిళనాడు కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ డాక్టర్ అస్లామ్ బాషా కూడా సైనా ట్వీట్ పై స్పందించారు. “సెక్యులరిజం మీ అభిమానుల మధ్య విభేదాలకు కారణమైంది… ఆడటాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. సైనా నెహ్వాల్ గతేడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…