తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ… కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్న వైఎస్ తనయ షర్మిలకు తక్షణం ఏం కావాలి? కీలక నేతల నుంచి మద్దతు చాలా? లేక ఇంకేమైనా కావాలా? అంటే.. దీనికి మించి.. ఆమెకు ఇప్పుడు ప్రచారం కావాలని.. మీడియా మద్దతు అత్యంత ముఖ్యమని అంటున్నారు పరిశీలకులు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు స్థాపించుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. సో.. షర్మిల కూడా పార్టీ పెట్టుకునేందుకు అన్ని అర్హతలు ఉన్న పౌరురాలే. కాబట్టి.. పార్టీ పెట్టడంపై ఎవరికి ఎలాంటి భేదాబిప్రాయం లేకపోయినా.. ఈమె పుంజుకోవడంపైనే అనేక అనుమానాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే.. బలమైన నాయకుడిగా ఉన్న సీఎం కేసీఆర్ను ఎదిరించి.. నిలవడం.. అధికారంలోకి రావడం అంటే.. అంత ఈజీకాదు. ఇప్పటికే కేడర్ బలంగానే ఉన్న కాంగ్రెస్ కేసీఆర్పై పైచేయి సాధించేందుకు కుస్తీ పడుతోంది. ఇక, బీజేపీ నేతలు.. కూడా అనేక విన్యాసాలు చేస్తున్నారు. ఇక, ఇక్కడ చెప్పుకోవాల్సింది.. ఏ పార్టీకైనా నేతకైనా ప్రచారం ముఖ్యం. ప్రధానంగా నిత్యం ప్రజల్లో చర్చ జరగాలంటే.. మీడియాలో హైలెట్ కావాల్సిందే. కాంగ్రెస్, బీజేపీల విషయంలో ఒక వర్గం మీడియా సహకారం కనిపిస్తోంది. ఇక, అధికార పార్టీకి సొంతగా మీడియా సంస్థే ఉంది.
ఈ క్రమంలో షర్మిల పార్టీకి తక్షణం కావాల్సింది.. ప్రచారం కల్పించే మీడియా సంస్థ! నిజానికి తెలంగాణలో సొంత సోదరుడు, ఏపీ సీఎం జగన్ మీడియా ఉంది. దీంతో షర్మిలకు భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తారని.. మొదట్లో అందరూ అనుకున్నారు.కానీ, ఈ మీడియా షర్మిలను పక్కన పెట్టింది. ఇక, కొన్ని మీడియా సంస్థలు మాత్రమే అంతో ఇంతో ప్రోత్సహిస్తున్నాయి. అయితే.. ఇది చాలదు! అంటున్నారు షర్మిల అభిమానులు. వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే.. ఖచ్చితంగా మీడియాలో ఎలివేట్ కావాల్సిందేనని.. సోషల్ మీడియాను నమ్ముకుంటే.. ప్రజలకు చేరువ కావడం కష్టమని.. సానుభూతిపరులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కూడా సొంత మీడియా ఏర్పాటుపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
బెంగళూరుకు చెందిన మీడియా సంస్థ అధినేతతో షర్మిల భర్త.. అనిల్ కుమార్ వారం రోజులుగా చర్చలు జరుపుతున్నారని.. సొంత మీడియా ఏర్పాటు చేసేందుకు నిధులు కూడా సమీకరిస్తున్నారని.. తెలుస్తోంది. కొందరు ప్రింట్ మీడియా కూడా కావాలని చెబుతున్నా.. ప్రస్తుతానికి టీవీ ఛానెల్ ఏర్పాటు కోసం.. ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వీలైతే.. పార్టీ ప్రకటన రోజే.. చానెల్ ఏర్పాటు విషయం కూడా ప్రకటించే అవకాశం ఉందని జోరు ఊహాగానాలు సాగుతున్నాయి. ఏదేమైనా.. ప్రస్తుత పరిస్థితిలో ప్రజల్లోకి వెళ్లాలంటే.. మీడియా వంటి బలమైన మద్దతు అవసరమనేది.. షర్మిల కూడా అంగీకరిస్తున్న నేపథ్యంలో ఛానెల్ ఏర్పాటు పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…