ఈ రోజుల్లో ఎందులో విజయం సాధించాలన్నా.. కష్టంతో పాటు.. లక్ కూడా ఉండాలి. అదృష్టం కలిసొచ్చి.. విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఫేట్ మార్చి.. అంతా మంచి జరిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ మ్యాటరేంటంటే… రేవంత్ రెడ్డి.. ఈ నెల 7వ తేదీన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో గాంధీ భవన్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాస్తు నిపుణులు, వేద పండితుల పరిశీలనలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి చాలా ఛేంజెస్ జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ టీమ్.. గాంధీ భవన్ క్యాంటిన్ దగ్గర ఉన్న పాత గేట్ నుండి ఎంట్రీ ఇచ్చి.. కొత్త గేటు నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక గాంధీ భవన్ లోపల కూడా కొన్ని మార్పులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సెక్యూరిటీ, పార్టీ జెండాలు అమ్మే రూమ్స్ ను తొలగించాలని నిర్ణయించారట. అలాగే తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆవరణలో ఒక్క గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా.. ఇంకెలాంటి నిర్మాణాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం. మరి ఈ మార్పులు చేసుకున్నాకైనా కాంగ్రెస్ కి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు…
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కెరీర్లో ‘ఇద్దరు’ పెద్ద డిజాస్టర్ కావచ్చు. కానీ కంటెంట్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్. మణిరత్నం…