ఈ రోజుల్లో ఎందులో విజయం సాధించాలన్నా.. కష్టంతో పాటు.. లక్ కూడా ఉండాలి. అదృష్టం కలిసొచ్చి.. విజయాలు సాధించిన వారు చాలా మందే ఉన్నారు. ఇదే సూత్రాన్ని ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఫేట్ మార్చి.. అంతా మంచి జరిగేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ మ్యాటరేంటంటే… రేవంత్ రెడ్డి.. ఈ నెల 7వ తేదీన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ క్రమంలో గాంధీ భవన్ లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. వాస్తు నిపుణులు, వేద పండితుల పరిశీలనలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి చాలా ఛేంజెస్ జరుగుతున్నట్లు సమాచారం. రేవంత్ టీమ్.. గాంధీ భవన్ క్యాంటిన్ దగ్గర ఉన్న పాత గేట్ నుండి ఎంట్రీ ఇచ్చి.. కొత్త గేటు నుంచి బయటకు వెళ్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక గాంధీ భవన్ లోపల కూడా కొన్ని మార్పులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సెక్యూరిటీ, పార్టీ జెండాలు అమ్మే రూమ్స్ ను తొలగించాలని నిర్ణయించారట. అలాగే తూర్పు ఈశాన్యం వైపు ఎలాంటి బరువు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆవరణలో ఒక్క గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా.. ఇంకెలాంటి నిర్మాణాలు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న సమాచారం. మరి ఈ మార్పులు చేసుకున్నాకైనా కాంగ్రెస్ కి అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి.
This post was last modified on July 3, 2021 6:42 pm
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…