Political News

షర్మిలకు తోడుగా ‘వ్యూహకర్త’

తెలంగాణా రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఓ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా ? అవుననే సమాధానం వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుండి. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానంటు షర్మిల రాజకీయాలకు తెరతీసిన విషయం తెలిసిందే. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి రోజున పార్టీ ప్రకటన, అజెండా, జెండా తదితరాలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని పార్టీ పెట్టబోతున్న షర్మిల అందుకు వీలుగా ఓ వ్యూహకర్తను ఏర్పాటు చేసుకున్నారట. ఇంతకీ ఆ వ్యూహకర్త ఎవరయ్యా అంటే ప్రశాంత్ కిషోర్ (పీకే) శిష్యురాలు ప్రియట. ప్రియ ఎవరంటే తమిళనాడు డీఎంకే ఎంఎల్ఏ రాజేంద్రన్ కూతురు. అంతేకాకుండా ఈమెకు తమిళనాడులో సొంతంగా ఓ మీడియాను కూడా నడుపుతున్నారట.

అన్నింటికీ మించి పీకేతో కలిసి పనిచేసిన అనుభవమే చాలా ఎక్కువగా ఉందని సమాచారం. అందుకనే ఏరి కోరి తనకు అవసరంగా ఉంటుందని ప్రియను షర్మిల ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. రాబోయే అంటే 2023 ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ గట్టి ప్రభావం చూపుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపితే ఆ తర్వాత అంటే 2028 ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని కూడా మరికొందరు ఆశల పల్లకిలో ఊగుతున్నారు. సరే ఏదేమైనా పీకేను రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇపుడు పీకే శిష్యురాలు ప్రియను చెల్లెలు షర్మిల వ్యూహకర్తగా పెట్టుకున్నారు. మరి ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 3, 2021 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

3 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

4 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

7 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

7 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

7 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

8 hours ago