బీసీలు.. ఈ మాట అనగానే రాజకీయ పార్టీలకు, నేతలకు ఎనలేని ప్రేమ పొంగిపోతుంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామనికూడా వారు ప్రకటించుకుంటారు. అయితే.. వాస్తవంలోకి వచ్చే సరికి.. ఏపీలో ఏ ప్రబుత్వం ఉన్నా.. బీసీలు ఎప్పటికప్పుడు ఉద్యమం పేరిట దూకుడుగా ఉంటూనే ఉన్నారు. మరి దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
బీసీల కు ప్రత్యేకంగా పార్టీని ఏర్పాటు చేస్తామని కూడా ఇటీవల కాలంలో బీసీ సంఘాల నాయకులు కేసన శంకర్రావు వంటివారు ప్రకటిస్తున్నారు. అయితే.. వాస్తవానికి వీరిలో నిజానికి ఉన్న లక్ష్యం ఏపాటిది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా చూసుకున్నా.. పదవుల పరంగా చూసుకున్నా.. బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే వాదన ఉంది. అదే సమయంలో ప్రజలకు కూడా ప్రబుత్వాలు ఏమీ చేయడం లేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో ఆయా సమస్యలపై ఉమ్మడి రాష్ట్రంలో బీసీ నేతలు.. పోరాటాలు చేశారు. లాఠీ దెబ్బలు సైతం తిన్నారు. దీనికి ఆర్. కృష్ణయ్య నేతృత్వం వహించడంతో.. ఆయన పేరు అప్పట్లో మార్మోగిపోయింది. కొన్నాళ్లు బాగానే బీసీ ఉద్యమాలు సాగినా.. తర్వాత రాష్ట్ర విభజనతో.. కృష్ణయ్య రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.
ప్రజాప్రతినిధిగా కూడా కృష్ణయ్య గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, ఆ తర్వాత.. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం బీసీ సంఘాలను పెద్దగా పట్టించుకునేవారు కరువయ్యారు. గతంలో చంద్రబాబు హయాంలో అయినా.. ఇప్పుడు జగన్ పాలనలో అయినా.. బీసీల తరఫున, వారి హక్కుల తరఫున పెద్దగా దూకుడుగా ఉన్న ముందుకు వచ్చే నేతలు కరువయ్యార నేది వాస్తవం.
అయితే.. అప్పుడప్పుడు గళాలు వినిపిస్తున్నా.. మాకు కూడా రాజ్యాధికారం కావాలని.. ప్రకటనలు చేస్తున్నా.. ఆశించిన విధంగా మాత్రం దూకుడు లేదనేది వాస్తవం. అంతేకాదు… రాజకీయ నేతలుగా రాణించేందుకు అవకాశం వస్తే.. పోటీ చేసేందుకు నేతలు రెడీ కావడం మరింత వివాదానికి దారితీస్తోంది. మరి ఈ పరిస్థితి మారితేనే .. బీసీల మధ్య ఐక్యత కొనసాగుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 8, 2021 7:31 pm
2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…
పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…