Political News

లేని పార్టీని చూసి భ‌య‌ప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌లు.. రీజ‌నేంటి?

తెలంగాణ అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు.. కొన్ని రోజులుగా దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై తీవ్ర కామెంట్లు చేస్తున్నారు. ఆయ‌న‌ను నీటి దొంగ అని ఒక‌రంటే.. కాదు.. గ‌జ దొంగ అని మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఇంకొంద‌రు.. ఏకంగా ఆయ‌న‌ను న‌ర‌రూప రాక్ష‌సుడ‌ని.. కూడా అనేశారు. నిజానికి తెలంగాణ వాదంతో సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుని ఏడేళ్ల త‌ర్వాత‌.. ఇప్పుడు వైఎస్‌ను తిట్టాల్సిన అవ‌స‌రం ఏంటి? ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నీటి వివాదాలు ఉంటే.. ఏపీని టార్గెట్ చేసుకుని సీఎం జ‌గ‌న్‌ను కామెంట్ చేయాలి. కానీ.. అనూహ్యంగా ఈ రోచ్చులోకి చ‌నిపోయిన నేత‌ను ఎందుకు లాగుతున్నారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌.

దీనికి స‌మాధానం.. లేని పార్టీని చూసి భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైఎస్ కుమార్తె.. ష‌ర్మిల సొంత కుంప‌టి పెట్టుకుని.. త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి పాద‌యాత్ర రూపంలో అరంగేట్రం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు భావిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌, బీజేపీ పుంజుకోవ‌డంతోపాటు.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు, లోపాలు కూడా టీఆర్ఎస్‌ను ఎంత లేద‌న్నా భ‌య‌పెడుతున్నా యి. ఈ స‌మ‌యంలో.. ష‌ర్మిల క‌నుక అరంగేట్రం చేసి.. సెంటిమెంటును రాజేస్తే.. మ‌రింత క‌ష్ట‌మ‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ అధిష్టానం.. మంత్రుల‌ను, నేత‌ల‌ను ముందుగానే అలెర్టు చేసిందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

రాజ‌న్న పేరుతో ఏ సెంటిమెంటునైతే.. ష‌ర్మిల ర‌గిలించాల‌ని చూస్తున్నారో.. అదే సెంటిమెంటు లేకుండా చేసేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే నీటి వివాదాల‌ను అడ్డు పెట్టుకుని వైఎస్‌ను ఏకేస్తున్నార‌ని చెబుతు న్నారు. అయితే.. ఇది కూడా ప్ర‌మాద‌మేన‌ని.. కొంత వ‌ర‌కు విమ‌ర్శించినా త‌ప్పులేద‌ని, కానీ, అదేప‌నిగా.. భారీ డైలాగుల‌తో విమ‌ర్శించ‌డం వ‌ల్ల వ్య‌తిరేక ఫ‌లిత‌మే వ‌స్తుంద‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఎక్క‌డైనా.. కొంత వ‌ర‌కు విమ‌ర్శ‌లు చేస్తే.. ప్ర‌జ‌లు అర్ధం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు శృతి మించిన ధోర‌ణిలో వైఎస్‌ను ఇన్నేళ్ల త‌ర్వాత ఏకేయ‌డం ప్రారంభిస్తే.. దీనిని రాజ‌కీయ కోణంలోనే చూస్తారు త‌ప్ప‌.. టీఆర్ ఎస్ ఆశించిన ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి నేతలు ఈ విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 8, 2021 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

39 minutes ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

7 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

9 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

11 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

12 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

13 hours ago