ఔను! ఈ లెక్కలేంటి? ఈ లోకం ఏంటి? ఇదీ.. ఇప్పుడు టీడీపీ గురించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ప్రస్తుతం ఎవరు కాదన్నా.. ఔనన్నా.. టీడీపీకి జీవితకాల మద్దతు దారులు సైతం అంగీకరిస్తున్న కీలక విషయం.. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని! దీనిని ఎవరూ కాదనరు. మరి పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అంటే.. మాత్రం వేళ్ల మీదనే లెక్కించుకోవాల్సి వస్తోంది. అదేసమయంలో పార్టీ పరిస్థితి ఇలా ఉంటే.. కొందరు నేతలు.. మాత్రం తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది.. నేను మంత్రిని అయిపోతాను.. అని సదరు నేతలు డప్పు కొంటున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో(అన్నీకావు) అయితే.. ఏకంగా ‘కాబోయే మంత్రి’ అంటూ.. అనుచరులు కటౌట్లు కూడా పెడుతున్నారు. ఇది మరీ విచిత్రంగా అనిపిస్తున్నా.. నిజమే. ఇదంతా కూడా సదరు నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుండడం మరింత చిత్రంగా ఉంది. ప్రస్తుతం వైసీపీగాలి బాగానే ఉంది. లేకపోతే.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు తనకు పట్టున్న జిల్లాలను సైతం పోగొట్టు కుంటుంది?
బహుశ దీనిని దృష్టిలో పెట్టుకునే వయసుతో నిమిత్తం లేకుండా చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. కరోనా సమయంలోనూ ఆయన రెస్ట్ తీసుకోకుండా సకల మాధ్యమాలనూ వినియోగించుకుని పార్టీ పుంజుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని డెవలప్ చేయాలని సూచిస్తున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం.. నేల విడిచి సాము చేస్తున్నట్టుగా.. ప్రయత్నిస్తున్నారు. ఇంకేముంది.. టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుంది. మేమే మంత్రులం ఈ కోటా మేం తప్ప ఇంకెవరికి ఇస్తారు! ఆ కోటాలో మాకే దక్కుతుంది.. అని లోపాయికారీ ప్రచారాలతో.. ఊదర గొడుతున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక కదా.. ఇవన్నీ ఉండాలి. కానీ, ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయంలో ఉండగానే.. ఇప్పటి నుంచే నేతలు.. ఇలా మైండ్ గేమ్ ఆడుతుండడంపై సోషల్ మీడియా వేదికగా..విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా నేతలు వాస్తవాలను గ్రహించి పార్టీ కోసం శ్రమించాలని.. అధికారంలొకి వచ్చాక.. ప్రయత్నిస్తే.. మంచిదని అంటున్నారు పార్టీ సానుభూతిపరులు. మరి ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి.
This post was last modified on July 20, 2021 8:46 am
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…