దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది.
ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. కాగా.. తమకు ఆక్సీజన్ సరిపోయిన తర్వాత.. ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు తీసుకోవాలంటూ ఆఫర్ చేయడంతో.. అందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ప్రశంసలు కురిపించారు. అయితే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ ను డిమాండ్ చేసిందని తేల్చింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తాజాగా ఇచ్చిన రిపోర్ట సంచలనంగా మారింది. ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా.. 12వందలు డిమాండ్ చేసిందని తెలిపింది. దానివల్ల 12 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 29 నుంచి మే 10 మధ్య కొన్ని హాస్పిటల్స్ ఆక్సిజన్ విషయంలో భారీ తప్పిదాలు చేశాయని కమిటీ తేల్చింది. 11వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని చెప్పాయని.. లెక్కలన్నీ చూస్తే.. 209 మెట్రిక్ టన్నులుగా తేలిందని వివరించిందిది. డిమాండ్ ను సరిగ్గా లెక్కించడంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే అవసరం ఉన్నదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అడిగిందని స్పష్టం చేసింది కమిటీ.
This post was last modified on June 25, 2021 6:58 pm
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…
నారా రోహిత్ చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా ప్రతినిధి-2. ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఒకే సమయంలో…
రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు…