Political News

కేజ్రీవాల్ తప్పుడు లెక్కలు.. తేల్చిన ఆడిట్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది.

ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. కాగా.. తమకు ఆక్సీజన్ సరిపోయిన తర్వాత.. ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు తీసుకోవాలంటూ ఆఫర్ చేయడంతో.. అందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ప్రశంసలు కురిపించారు. అయితే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ ను డిమాండ్ చేసిందని తేల్చింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తాజాగా ఇచ్చిన రిపోర్ట సంచలనంగా మారింది. ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 300 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉండ‌గా.. 12వందలు డిమాండ్ చేసిందని తెలిపింది. దానివల్ల 12 రాష్ట్రాల్లో తీవ్ర‌మైన ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింద‌ని స్ప‌ష్టం చేసింది.

ఏప్రిల్ 29 నుంచి మే 10 మ‌ధ్య కొన్ని హాస్పిట‌ల్స్ ఆక్సిజన్ విషయంలో భారీ త‌ప్పిదాలు చేశాయ‌ని క‌మిటీ తేల్చింది. 11వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని చెప్పాయని.. లెక్కలన్నీ చూస్తే.. 209 మెట్రిక్ ట‌న్నులుగా తేలింద‌ని వివరించిందిది. డిమాండ్‌ ను స‌రిగ్గా లెక్కించ‌డంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే అవ‌స‌రం ఉన్న‌దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అడిగింద‌ని స్పష్టం చేసింది కమిటీ.

This post was last modified on June 25, 2021 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

8 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

48 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago