దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది.
ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. కాగా.. తమకు ఆక్సీజన్ సరిపోయిన తర్వాత.. ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు తీసుకోవాలంటూ ఆఫర్ చేయడంతో.. అందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ప్రశంసలు కురిపించారు. అయితే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ ను డిమాండ్ చేసిందని తేల్చింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తాజాగా ఇచ్చిన రిపోర్ట సంచలనంగా మారింది. ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా.. 12వందలు డిమాండ్ చేసిందని తెలిపింది. దానివల్ల 12 రాష్ట్రాల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 29 నుంచి మే 10 మధ్య కొన్ని హాస్పిటల్స్ ఆక్సిజన్ విషయంలో భారీ తప్పిదాలు చేశాయని కమిటీ తేల్చింది. 11వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని చెప్పాయని.. లెక్కలన్నీ చూస్తే.. 209 మెట్రిక్ టన్నులుగా తేలిందని వివరించిందిది. డిమాండ్ ను సరిగ్గా లెక్కించడంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే అవసరం ఉన్నదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అడిగిందని స్పష్టం చేసింది కమిటీ.
This post was last modified on June 25, 2021 6:58 pm
హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో…
కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కావాలంటే తొంబై రోజుల ముందే అప్లై చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిన్న…
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…