Political News

కేజ్రీవాల్ తప్పుడు లెక్కలు.. తేల్చిన ఆడిట్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది.

ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. కాగా.. తమకు ఆక్సీజన్ సరిపోయిన తర్వాత.. ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాలకు తీసుకోవాలంటూ ఆఫర్ చేయడంతో.. అందరూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ప్రశంసలు కురిపించారు. అయితే.. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ.. ఢిల్లీ ప్రభుత్వం అవసరానికి మించి ఆక్సిజన్ ను డిమాండ్ చేసిందని తేల్చింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ తాజాగా ఇచ్చిన రిపోర్ట సంచలనంగా మారింది. ఆక్సిజన్ అవసరాన్ని లెక్కించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. 300 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉండ‌గా.. 12వందలు డిమాండ్ చేసిందని తెలిపింది. దానివల్ల 12 రాష్ట్రాల్లో తీవ్ర‌మైన ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింద‌ని స్ప‌ష్టం చేసింది.

ఏప్రిల్ 29 నుంచి మే 10 మ‌ధ్య కొన్ని హాస్పిట‌ల్స్ ఆక్సిజన్ విషయంలో భారీ త‌ప్పిదాలు చేశాయ‌ని క‌మిటీ తేల్చింది. 11వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించామని చెప్పాయని.. లెక్కలన్నీ చూస్తే.. 209 మెట్రిక్ ట‌న్నులుగా తేలింద‌ని వివరించిందిది. డిమాండ్‌ ను స‌రిగ్గా లెక్కించ‌డంలో కేజ్రీవాల్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని.. అందుకే అవ‌స‌రం ఉన్న‌దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ అడిగింద‌ని స్పష్టం చేసింది కమిటీ.

This post was last modified on June 25, 2021 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీరభద్రుడా… మంచి పని చేశావ్ !

తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…

14 minutes ago

అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…

2 hours ago

సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…

2 hours ago

ఈ విషయంలో రాజశేఖర్ సూపర్

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…

4 hours ago

సీఎం కుర్చీపై అనిరుధ్ రెడ్డి కన్ను

ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…

4 hours ago

బ్రో దర్శకుడి సినిమాకు చప్పుడు లేదు

ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…

5 hours ago