Categories: Political News

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌.. మ‌ళ్లీ లైన్లోకొచ్చారు

గ‌త నెలలో జ‌ర‌గాల్సిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక ఎన్నిక‌ల్ని కరోనా కార‌ణంగా వాయిదా వేస్తూ సంచ‌లన నిర్ణ‌యం తీసుకుని చ‌ర్చ‌నీయాంశం అయ్యారు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌. ఆ నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌హా వైకాపా పెద్ద‌లు ఎలా మండిప‌డ్డారో.. ఈసీపై ఎంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారో తెలిసిందే. వాళ్ల విమ‌ర్శ‌లు, బెదిరింపుల త‌ర్వాత త‌న‌కు భ‌ద్ర‌త అవ‌స‌ర‌మంటూ కేంద్రానికి లేఖ రాయ‌డంతో ర‌మేష్ మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. ఆ త‌ర్వాత అంద‌రూ క‌రోనా చ‌ర్చ‌ల్లో మునిగిపోవ‌డంతో ర‌మేష్ పేరు ఎక్క‌డా పెద్ద‌గా వినిపించ‌లేదు. ఐతే కొంత విరామం త‌ర్వాత ఈసీసీ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఏపీ అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల అభ్య‌ర్థులు.. క‌రోనా సాయం కింద ఇస్తున్న వెయ్యి రూపాయ‌లు అంద‌జేస్తూ త‌మ‌కే ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీనిపై ఈసీకి ఫిర్యాదులు అంద‌డంతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. కానీ ప్రస్తుత సంధికాలంలో ప్రచారంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని రమేష్‌ ‌కుమార్ స్పష్టం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వప్రయోజనాల కోసం ప్రచారం..ఓటర్లను ప్రభావితం తదితర చర్యలు చేయకూడద‌ని.. అలా చేస్తే ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై క్షేత్రస్థాయి అధికారులు దృష్టిసారించాలని.. నిజానిజాలను విచారించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు ఆయన లేఖ రాశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి  తమ స్వప్రయోజనాల కోసం ప్రజల మద్దతు కోరుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని రమేశ్‌కుమార్‌ చెప్పారు. క‌రోనా సాయం కింద నగదు పంపిణీ చేసే సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు భాజపా, సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈసీ ఇలా స్పందించారు.

This post was last modified on April 9, 2020 6:50 pm

Share

Recent Posts

సౌండ్ సరిపోతుందా శ్రీనివాసా

వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…

1 hour ago

బెజవాడ నడిబొడ్డున ముద్రగడ విగ్రహం

కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…

3 hours ago

కాబోయే విద్యాశాఖ మంత్రి ఎవరు?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…

3 hours ago

యువత తిరగబడింది… రాజ్యం ఉలికిపడింది!

నిజమే... యువత తిరగబడింది. రాజ్యం ఉలిక్కిపడింది. యువతలో ఆగ్రహావేశాలకు కారణంగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి…

4 hours ago

శ్రీగౌరి నేర్చుకోవాల్సిన బేబీ పాఠాలు

మూడేళ్ళ క్రితం బేబీ విడుదలై బ్లాక్ బస్టర్ సాధించాక అందరి  అటెన్షన్ తీసుకున్న అమ్మాయి వైష్ణవి చైతన్య. అప్పటిదాకా చిన్న…

5 hours ago

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

6 hours ago