నరాసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పని చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు.. వారికుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలపై ఏదో ఒక లిటిగేషన్ ను తెర మీదకు తీసుకొచ్చి కోర్టును ఆశ్రయించటం అలవాటుగా మారింది. తాజాగా ఆ పరంపరలో మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులోదాఖలు చేశారు.
జగన్ కంపెనీ అయిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుపై తాజాగా సవాలు విసిరారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయన..మైనింగ్ లీజు పొడిగింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపించారు. ఇదే విషయాన్ని సీబీఐ కూడా నిర్దారించినట్లు రఘురామ పేర్కొనటం గమనార్హం.
సీబీఐ కేసును ప్రస్తావించకుండా లీజు పొడిగింపును పొందారని.. ఇది సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత కంపెనీ కావంతోనే అధికారులునిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో సరస్వతి కంపెనీతో పాటు ఏపీ పరిశ్రమల శాఖ.. మైనింగ్ శాఖ.. ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా చేర్చారు. మరీ.. పిటిషన్ పై హైకోర్టు ఏమంటుందో చూడాలి.
This post was last modified on June 23, 2021 3:29 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…