నరాసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇప్పుడు సింగిల్ ఎజెండాతో పని చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు.. వారికుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలపై ఏదో ఒక లిటిగేషన్ ను తెర మీదకు తీసుకొచ్చి కోర్టును ఆశ్రయించటం అలవాటుగా మారింది. తాజాగా ఆ పరంపరలో మరో పిటిషన్ ను ఏపీ హైకోర్టులోదాఖలు చేశారు.
జగన్ కంపెనీ అయిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజు పొడిగింపుపై తాజాగా సవాలు విసిరారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయన..మైనింగ్ లీజు పొడిగింపులో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ఆరోపించారు. ఇదే విషయాన్ని సీబీఐ కూడా నిర్దారించినట్లు రఘురామ పేర్కొనటం గమనార్హం.
సీబీఐ కేసును ప్రస్తావించకుండా లీజు పొడిగింపును పొందారని.. ఇది సరికాదంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురామ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత కంపెనీ కావంతోనే అధికారులునిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో సరస్వతి కంపెనీతో పాటు ఏపీ పరిశ్రమల శాఖ.. మైనింగ్ శాఖ.. ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా చేర్చారు. మరీ.. పిటిషన్ పై హైకోర్టు ఏమంటుందో చూడాలి.
This post was last modified on June 23, 2021 3:29 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…