Political News

సుధాకర్ కేసు- జగన్ కు ఐఎంఏ లేఖ

సస్పెండైన అనస్తీషియా డాక్టరు సుధాక్ అరెస్టు వివాదం ఏపీ ప్రభుత్వాన్ని కాస్త ఇరుకున పడేసినట్లే కనిపిస్తోంది. దీనిపై ఈరోజు రెండు కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుధాకర్ వ్యవహారంపై లేఖ రావడం ఒక సంఘటన కాగా, హైకోర్టు సుధాకర్ విషయంలో తనదైన శైలిలో స్పందించడం రెండో ఘటన.

డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆ నివేదికను ముఖ్యమంత్రి జగన్ కి పంపింది. దీంతో పాటు సుధాకర్ పై పోలీసుల అనుచిత ప్రవర్తనపై కూడా ఐఎంఏ అసహనం వ్యక్తంచేసింది. డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషంగా ఉందని, ఇది డాక్టరు వృత్తిలో ఉన్న వారిలో ఆందోళన కలిగించే విధంగా ఉందని లేఖలో పేర్కొంది. ఒక వైద్యుడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దేశ వ్యాప్తంగా డాక్టర్లలో మనోవేదనకు గురిచేసేలా ఉందని లేఖలో పేర్కొంది. అదే సమయంలో సుధాకర్ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పు పట్టింది. వైద్యుడిగా సుధాకర్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది.

మరోవైపు ఈ కేసు హైకోర్టుకు చేరింది. ఈ వ్యవహారంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు డాక్టర్ సుధాకర్‌ను బుధవారం (ఈనెల 20వ తేదీ) తమ ముందు హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది. డాక్టర్‌ను కలుసుకునేందుకు తల్లికి అవకాశం ఇవ్వలేదన్న ఆరోపణలపై కూడా సమాధానం చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కోరుతూ జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on May 20, 2020 1:57 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

18 minutes ago

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…

44 minutes ago

వీరభద్రుడా… మంచి పని చేశావ్ !

తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…

1 hour ago

అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…

2 hours ago

సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…

3 hours ago

ఈ విషయంలో రాజశేఖర్ సూపర్

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…

4 hours ago