Political News

లాట‌రీ త‌గిలితేనే స్వ‌స్థ‌లాల‌కు..

ఉన్న చోట పూట గ‌డ‌వ‌క.. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న క‌ష్టాలేంటో గ‌త కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ల క‌ష్టాలు చూసి క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయి జ‌నాల‌కు. ఐతే వీరి కోసం ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సులు ఏర్పాటు చేశాక కూడా కార్మికులు కాలిన‌డ‌క ఆప‌ట్లేదు. ఎండ‌ల్లో త‌ట్టాబుట్టా నెత్తిన పెట్టి.. పిల్ల‌ల్ని వెంట పెట్టుకుని న‌డ‌క సాగిస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ప్ర‌యాణ ఏర్పాట్లు చేసినా వీళ్లెందుకు ఇంత క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న సందేహం రావ‌డం స‌హ‌జం. ఐతే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైళ్లు.. వ‌ల‌స కార్మికుల‌కు ఏమాత్రం స‌రిపోయేలా లేక‌పోవ‌డం, త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతోనే వాళ్లు అంత క‌ష్టానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

ఒక్కో రైల్లో 1200-1400 మంది మాత్రమే వెళ్లేందుకు వీలుండటం, కార్మికులు వేల సంఖ్యలో ఉండటంతో ఎవ‌రిని స్వ‌స్థ‌లాల‌కు పంపాల‌నే విష‌యంలో తెలంగాణ‌ ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. తొలుత కార్మికులందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడంతో తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇలా పేర్లు న‌మోదు చేసుకున్న అంద‌రికీ ప్ర‌యాణ ఏర్పాట్లు చేయ‌డం క‌ష్టంగా ఉంది. దీంతో ఒక్కో రైలుకు ప్రతి ప్రాంతం నుంచి 10-15 మందికి అవకాశం కల్పించాలని, వారిని ఆయా స్టేషన్‌లకు బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం లాట‌రీ వేస్తున్నారు.

అందులో ఎంపికైన 15 మందికి ప్ర‌యాణ ఏర్పాట్లు చేస్తు‌న్నారు. ఇప్పటివరకు ఇలా 80 వేల మందిని త‌ర‌లించారు. 15 రోజుల క్రితం పేరు నమోదు చేసుకున్న వారికి కూడా ఇంకా పిలుపు రాకపోవవడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు. లాట‌రీలో త‌మ పేర్లు ఎప్పుడొస్తాయో తెలియ‌క కొన్ని రోజులు ఎదురు చూసి కాలిన‌డ‌క‌న స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరుతున్నారు కొంద‌రు కార్మికులు. ఇంకొంద‌రేమో ట్రక్కులను, అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

This post was last modified on May 20, 2020 2:33 am

Share
Show comments
Published by
suman

Recent Posts

ముందే తెలిసినా లాభం లేదు రాశీ

గత ఏడాది విడుదలైన 'తెలుసు కదా' అంచనాలు అందుకోలేక సిద్ధూ జొన్నలగడ్డ ఖాతాలో మరో డిజాస్టర్ వేసిన తెలిసిందే. న్యూ…

1 hour ago

దురంధర్ దూకుడు… సరిపోని ఉస్తాద్ చప్పుడు

బహుశా ఇలాంటి వెరైటీ భారీ బాక్సాఫీస్ క్లాష్ గతంలో చూసి ఉండం. ఒక హిందీ మూవీతో తెలుగు సినిమా కాంపీట్…

3 hours ago

డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీకి పాజిటివ్

బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు…

4 hours ago

అక్క‌డ‌ `జ‌న‌సేన‌` ఉడుంప‌ట్టు

గిరిజ‌న ప్రాబ‌ల్యం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవ‌ల కాలంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్…

5 hours ago

మ‌ల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి మ‌రో లీడ‌ర్‌..?

బీఆర్ఎస్ నాయ‌కుడు, మాటల తూటాల‌ను త‌న‌దైన శైలిలో ఎటైనా తిప్ప‌గ‌ల నేర్ప‌రిగా పేరొందిన‌ నేత‌.. అన్నింటికీ మించి `అంద‌రివాడు`గా గుర్తింపు…

5 hours ago

భవిష్యత్తుని శాసించబోతున్న డాల్బీ సినిమా

వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…

11 hours ago