Political News

లాట‌రీ త‌గిలితేనే స్వ‌స్థ‌లాల‌కు..

ఉన్న చోట పూట గ‌డ‌వ‌క.. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న క‌ష్టాలేంటో గ‌త కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ల క‌ష్టాలు చూసి క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయి జ‌నాల‌కు. ఐతే వీరి కోసం ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సులు ఏర్పాటు చేశాక కూడా కార్మికులు కాలిన‌డ‌క ఆప‌ట్లేదు. ఎండ‌ల్లో త‌ట్టాబుట్టా నెత్తిన పెట్టి.. పిల్ల‌ల్ని వెంట పెట్టుకుని న‌డ‌క సాగిస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ప్ర‌యాణ ఏర్పాట్లు చేసినా వీళ్లెందుకు ఇంత క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న సందేహం రావ‌డం స‌హ‌జం. ఐతే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైళ్లు.. వ‌ల‌స కార్మికుల‌కు ఏమాత్రం స‌రిపోయేలా లేక‌పోవ‌డం, త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతోనే వాళ్లు అంత క‌ష్టానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

ఒక్కో రైల్లో 1200-1400 మంది మాత్రమే వెళ్లేందుకు వీలుండటం, కార్మికులు వేల సంఖ్యలో ఉండటంతో ఎవ‌రిని స్వ‌స్థ‌లాల‌కు పంపాల‌నే విష‌యంలో తెలంగాణ‌ ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. తొలుత కార్మికులందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడంతో తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇలా పేర్లు న‌మోదు చేసుకున్న అంద‌రికీ ప్ర‌యాణ ఏర్పాట్లు చేయ‌డం క‌ష్టంగా ఉంది. దీంతో ఒక్కో రైలుకు ప్రతి ప్రాంతం నుంచి 10-15 మందికి అవకాశం కల్పించాలని, వారిని ఆయా స్టేషన్‌లకు బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం లాట‌రీ వేస్తున్నారు.

అందులో ఎంపికైన 15 మందికి ప్ర‌యాణ ఏర్పాట్లు చేస్తు‌న్నారు. ఇప్పటివరకు ఇలా 80 వేల మందిని త‌ర‌లించారు. 15 రోజుల క్రితం పేరు నమోదు చేసుకున్న వారికి కూడా ఇంకా పిలుపు రాకపోవవడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు. లాట‌రీలో త‌మ పేర్లు ఎప్పుడొస్తాయో తెలియ‌క కొన్ని రోజులు ఎదురు చూసి కాలిన‌డ‌క‌న స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరుతున్నారు కొంద‌రు కార్మికులు. ఇంకొంద‌రేమో ట్రక్కులను, అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

suman

Recent Posts

మూడు రిస్కులకు అల్లు అర్జున్ సిద్ధం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్,…

8 minutes ago

అమెరికా కొత్త బాంబ్… ఇండియాకు 100% టారిఫ్ సెగ?

రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా…

38 minutes ago

ముద్రగడ నివాసంలో రాజకీయమెందుకు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన సంగతి తెలిసిందే. గతకొంతకాలంగా  తీవ్ర అనారోగ్యంతో సతమతం…

43 minutes ago

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘ది ఒడిస్సీ’

ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…

5 hours ago

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…

9 hours ago

‘ఎన్టీఆర్ పేరుతో ప్రెస్ నోట్… సంతకం ఎక్కడ?’

ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేప‌డుతున్న సేవా కార్య‌క్ర‌మాల వ్య‌వ‌హారం ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి…

11 hours ago