Political News

జగన్ ది రహదారి కాదు, రాజారెడ్డి దారి – చంద్రబాబు

ఎల్జీ పాలిమర్స్ కు 1996లో చంద్రబాబే అనుమతులు ఇచ్చారంటూ ఈరోజు మధ్యాహ్నం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు తండ్రి దారిలో, ముఖ్యమంత్రి అయ్యాక తాత దారిలో నడుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

అడ్డొచ్చిన వారిపై అక్రమకేసులు బనాయించి తప్పించుకోవాలని చూస్తున్నారని.. చంద్రబాబు ఆరోపించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఎల్జీ పాలిమర్స్ బాధితులతో మాట్లాడారు. ఆ సందర్భంగా చంద్రబాబే ఎల్జీ పాలిమర్స్ కు కారకుడు అన్న విషయం తెలిసిందే. అందుకే చంద్రబాబు తీవ్రంగా స్పందించినట్టు అర్థమవుతోంది.

కోవిడ్ పై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కరోనా వైరస్ తెచ్చింది కూడా టీడీపీనే అని ప్రచారం చేయగల సమర్థులని వ్యాఖ్యానించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్లే ఏపీలో కరోనా వ్యాప్తి అంత దారుణంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో దిగజారిన పరిస్థితుల నుంచి, తన వైఫ్యలాలు జనాలు చర్చించుకోకుండా చేయడానికి కేసీఆర్ నీటి పంపకాల చర్చను తెరమీదకు తెచ్చారని అన్నారు. కాళేశ్వరానికి పునాది వేసిన రోజు కాళేశ్వరం పూర్తయితే ఆంధ్రా-తెలంగాణ ఇండియా-పాకిస్తాన్ లా మారతాయని వ్యాఖ్యానించి దీక్షకు దిగిన జగన్ స్వయంగా వెళ్లి ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారని విమర్శించారు.

తాను తప్పులు చేసి ఎవరూ తనను ఏమీ అనకూడదు అనుకుంటారని, ఇళ్ల పట్టాలు ఇస్తున్నది ప్రజలపై ప్రేమతో కాదని, అది కూడా ఓ స్కాం అన్నారు. అతనికి చట్టాలంటే లెక్క లేదని, ఆ లెక్కలేని తనంతో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వల్లే కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చంద్రబాబు అన్నారు.

This post was last modified on May 18, 2020 11:41 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

8 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

8 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

9 hours ago