వందేళ్ల సీనియార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 51వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. నిజానికి గాంధీల కుటుంబం పరంగా చూస్తే.. ఇందిర, రాజీవ్గాంధీలు.. ఈ వయసులోపే.. అంటే ఫార్టీల్లోనే ప్రధానమంత్రి పీఠాలను అధిరోహించారు. అలాంటి రికార్డు ఉన్న గాంధీల వారసుడుగా రాహుల్ కు ఇప్పుడు పెద్దబాధ్యతే ఉంది. ప్రస్తుతం 51వ ఏడులోకి అడుగు పెట్టిన రాహుల్.. కరోనా నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు కన్వే చేశారు.
కలిసి వస్తున్న నేతలు..
ఇక, రాహుల్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా చాలా మంది ముఖ్యమంత్రులు శుభాకాం క్షలు చెప్పారు. ఈ వరుసలో తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సహా ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఉన్నారు. వీరంతా కూడా రాహుల్కు ఉజ్వల భవిత ఉండాలని ఆకాంక్షించారు. దీనిని బట్టి.. రాహుల్ పుంజుకుంటే.. తమ సహకారం ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక, దేశంలో ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే.. కనీసం ఆయనకు 54 ఏళ్లు వచ్చే సమయానికైనా పీఎం పీఠం ఎక్కే చాన్స్ కనిపిస్తోంది.
వ్యూహం ఏంటి?
వాస్తవానికి రాహుల్పై కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్కు ఇప్పుడున్న వారిలో రాహుల్ తప్ప గాంధీల కుటుంబం నుంచి వారసుడు లేరనేది సుస్పష్టం. అయితే.. రాహుల్ హయాంలో వచ్చిన గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక, రాష్ట్రాల్లోనూ ఆయన పుంజుకోలేక పోయారు. ఈ పరిణామంతోనే ఆయన పార్టీ అధ్యక్ష పీఠాన్ని వదులుకు న్నారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి ఏమీ మించిపోలేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా వ్యూహాత్మకంగా ఆయన దూకుడు చూపిస్తే.. కలిసివచ్చే కాలం సమీపంలోనే ఉందని చెబుతున్నారు.
మోడీ పై వ్యతిరేకత
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. కరోనా విషయంలోను, వ్యాక్సిన్ ఇచ్చే విషయంలోనూ ఆయన అనుసరించిన వైఖరి ఒక ఎత్తయితే.. పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదేసమయంలో సబ్సిడీ గ్యాస్ సిలెండర్ ధరలు పెంచడం.. సబ్సిడీలను కోసేయడం వంటివి కూడా జనాగ్రహానికి కారణాలు గా ఉన్నాయి. యువతకు ఉపాధి కల్పించలేక పోతున్నారనే వాదన కూడా ఉంది. ఇలాంటి అనేక పరిణామాలను రాహుల్ తనకు అనుకూలంగా మార్చుకుంటే.. గెలుపు తథ్యమనేది ప్రధాన సూచన. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 20, 2021 10:09 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…