కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్న ఏపీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి శ్రీవేంకటేశ్వర రావు.. ఉరఫ్ నాని..తాజాగా మళ్లీ రెచ్చిపోయారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి నాని.. సీఎం జగన్ పై విమర్శలు చేస్తే.. తాట తీస్తామని హెచ్చరించారు. రైతులకు పంగనామాలు పెట్టి పారిపోయారంటూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఊకకు-ధాన్యానికి తేడాతెలియని చంద్రబాబు.. రైతుల గురించి మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని అన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు బకాయిలు చెల్లించాలంటూ.. ఇటీవల చంద్రబాబు.. సీఎం జగన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయంపై ముచ్చటగా మూడు రోజులు గడిచి పోయిన తర్వాత స్పందించిన కొడాలి.. చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం. జగన్ను రైతు బాంధవుడి తో పోల్చిన ఆయన.. చంద్రబాబుతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో తాము లేమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ను విమర్శించే అర్హత బాబు కు లేదని అన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది బాబు కాదా? అని ప్రశ్నించారు.
అదేసమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను కూడా మంత్రి వదిలిపెట్టలేదు. లోకేష్ అచ్చోసిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారని.. పప్పు-తుప్పులు ఏం మాట్లాడినా చెల్లుతుందనుకునే పరిస్థితి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ విషయంపైనైనా సీబీఐ ఎంక్వయిరీ వేశారా? అని ప్రశ్నించారు. 21 రోజుల్లోనే తాము రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు.
కేంద్రం నుంచి నిధులు రాకపోయినా..తాము రాష్ట్ర ఖజానా నుంచి రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు. రైతులకుఏం చేయాలన్నా అది జగన్కే సాధ్యమని కొడాలి చెప్పుకొచ్చారు. పిచ్చివాగుడు వాగితే.. లోకేష్కు బడిత పూజ తప్పదని మంత్రి హెచ్చరించడం కొసమెరుపు. చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలు ఎంతోమంది హత్యకు గురయ్యారని .. వాటికి చంద్రబాబు బాధ్యత వహిస్తారా అని నిలదీశారు. గ్రామాల్లో జరుగుతున్న వివాదాలను వైసీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
This post was last modified on June 19, 2021 2:16 pm
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…