తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన కొందరు సీనియర్లు ఎప్పటి నుంచో పదవుల కోసం ఆశగా ఎదురు చేస్తున్నారు. కాగా.. వారిలో కొందరికి ఈ సారి మాత్రం కచ్చితంగా పదవులు దక్కేలా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, గవర్నర్ కోటాకు సంబంధించి ఒక స్థానం ఖాళీ అయ్యాయి. దీంతో.. వీటి కోసం ఆశావాహులు ఇప్పటి నుంచే పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు.
మరికొద్దిరోజుల్లో మంత్రి వర్గ వస్తరణ ఉండే అవకాశం ఉంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈసారి మంత్రి పదవి దక్కించుకునేవారిలో ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి.
వీరిద్దరిలో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే.. ఇద్దరిలో ఎవరికి దక్కనుంది అనే విషయమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ ఇద్దరు నేతలకు ఖమ్మం జిల్లాలో మంచి కేడర్ ఉంది. దీంతో.. ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి అధిష్టానం సముఖంగానే ఉంది. అయితే.. వారిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కనుంది. అది కూడా తుమ్మలతో పోలిస్తే.. పొంగులేటికే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లో చేరిప్పటి నుంచి చాలాసార్లు పొంగులేటికి పదవులు ఇస్తామని చెప్పి ఇవ్వేలేదు. దీంతో ఈ విషయంలో పొంగులేటి.. అతని అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నారట. అందుకే ఈ సారి.. పొంగులేటికి పదవి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
This post was last modified on June 18, 2021 12:29 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…