అవును వైసీపీ అధికారిక వెబ్ సైట్లో ఎంపిల జాబితాలో నుండి నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు పేరు మాయమైపోయిందట. లోక్ సభ+రాజ్యసభలో వైసీపీకి 28 మంది ఎంపిల బలముంది. మొన్నటి తిరుపతి ఉపఎన్నికలో గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరును కూడా పార్టీ అప్ డేట్ చేసింది. అయితే ఇదే సమయంలో నరసాపురం ఎంపి రఘురామ పేరు మాయమైపోయింది. ఇందుకు ప్రత్యేకించి కారణం ఇది అని తెలీటంలేదు.
ఒకసారి చరిత్రను గమనిస్తే 2019 ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే రఘురామకు జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ముందు పార్టీకి దూరంగా జరిగిన ఎంపి తర్వాత జగన్ కు కూడా దూరమైపోయారు. తర్వాత పార్టీ నేతలతో కలవటం మానేశారు. ఆ తర్వాత పార్టీపైనే కాకుండా ప్రభుత్వంపైన కూడా వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
చివరకు ఈ వ్యవహరం ఎంతదాకా వెళ్ళిందంటే డైరెక్టుగా జగన్నే టార్గెట్ చేసేంతవరకు వెళ్ళింది. పరిపాలనలో జగన్ చేస్తున్నతప్పొప్పుల గురించి మాట్లాడటం వరకు ఓకేనే. కానీ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. దాంతో పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేలా పరిస్ధితులు మారిపోయాయి. ఈ నేపధ్యంలోనే సీఐడీ అధికారులు ఎంపిపై కేసు పెట్టడం తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే.
తనను పార్టీ నుండి సస్పెండ్ చేయించుకోవాలనో లేకపోతే ఎలాగైనా బహిష్కరింప చేసుకోవాలనో ఎంపి తెగ ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ పై రెండు ఆప్షన్లు కాకుండా ఏకంగా ఎంపిపై అనర్హత వేటు వేయించేలా పావులు కదుపుతోంది. జగన్ ఢిల్లీ టూర్ మరుసటి రోజే స్పీకర్ ను పార్టీ చీఫ్ విప్ మార్గాని విప్ కలిసి బహిష్కరణ వేటుకు నోటీసిచ్చారు.
బహిష్కరణ లేఖను స్పీకర్ కు అందించిన మరుసటి రోజే పార్టీ అధికారిక వెబ్ సైట్లో ఎంపిల జాబితానుండి రఘురామ పేరును తీసేయటం గమనార్హం. అంటే రఘురామ విషయంలో ఢిల్లీలో ఏదో జరుగుతోందనే సంకేతాలు అందుతున్నట్లే అనుమానించాల్సొస్తోంది. ఇదే విషయమై రఘురామ మాట్లాడుతు తనను పార్టీ నుండి బహిష్కరించారా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. మరి ఏమి జరుగుతోందో అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 13, 2021 10:46 am
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…