Political News

తిరుమల దర్శనం.. ఏం చేస్తున్నారంటే?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఆలయాల్లో తిరుమల ఒకటి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుడిని దేశవ్యాప్తంగా భక్తులు ఎలా కొలుస్తారో.. ఆయన దర్శనం కోసం ఎలా తపిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ వేలాది మందితో కిక్కిరిసి ఉండే తిరుమల ఆలయం రెండు నెలలుగా మూతబడి ఉంది. కరోనా ప్రభావం తిరుమల మీదా పడింది.


దర్శనం ఆపేశారు. ఐతే లాక్ డౌన్ నిబంధనలు నెమ్మదిగా సడలిస్తున్న నేపథ్యంలో ఆలయంలోకి భక్తుల్ని అనుమతించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఐతే ఇంతకుముందులా పెద్ద సంఖ్యలో భక్తుల్ని ఆలయంలోకి పంపించే అవకాశం లేదు. పీక్ టైంలో రోజుకు 80 వేల మంది దాకా శ్రీవారిని దర్శించుకుంటారు. ఐతే ప్రస్తుతం కరోనా ముప్పు నేపథ్యంలో ఆ సంఖ్యలో బాగా తగ్గించనున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి రోజుకు ఇన్ని వేల మంది అని ఒక సంఖ్యను ఖరారు చేసి ఆ మేరకే దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ఐతే ఆలయంలో, తిరుమల పరిసర ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు, ఇతర నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. ఆలయంలోకి భక్తుల్ని పంపే విషయంలోనూ షరతులున్నాయి. కంపార్టుమెంట్లలో భక్తుల్ని పెట్టే పద్ధతి కొన్ని నెలల పాటు ఉండదు. అవన్నీ మూసి వేస్తున్నారు. నేరుగా క్యూ లైన్లలో ప్రవేశం మొదలవుతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి వచ్చే వరకు భక్తుడికి భక్తుడికి మధ్య దూరాన్ని నిర్దేశిస్తూ రెడ్ టేపుతో మార్కింగ్ చేశారు.

ఆ దూరం పాటిస్తూనే దర్శనానికి వెళ్లాలి. వసతి గదుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరికి మించి అనుమతించరు. తలనీలాల వద్ద కూడా షరతులుంటాయి. ఇక నేరుగా భక్తుల్ని అనుమతించకుండా ముందు ఓ ప్రయోగం చేయనున్నారు. టీటీడీలో పని చేసే ఉద్యోగుల కుటుంబాలకు మూడు రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఏవైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయేమో చూసి.. వాటిని సర్దుబాటు చేసి ఆ తర్వాత సాధారణ భక్తుల్ని అనుమతించనున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కొన్ని నెలల పాటు రద్దు చేసే అవకాశాలూ ఉన్నాయి.

This post was last modified on May 18, 2020 4:02 pm

Share
Show comments
Published by
Satya
Tags: TirumalaTTD

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

28 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

57 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago