Corona In Telangana
ఆ దేశంలో ఏకంగా లక్ష ప్లస్ కరోనా పాజిటివ్ కేసులట.. ఒక్క రోజులో అన్ని వేల కేసులట.. వందల్లో మరణాలట.. అంటూ నెల కిందట వేరే దేశాల గురించి వార్తలు చదువుకునే వాళ్లం. ఐతే ఇప్పుడు ఇండియానే ఆ స్థితికి వచ్చేసింది. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య సోమవారం లక్ష మార్కును టచ్ చేసేసింది.
కొన్ని రోజులుగా సగటున రోజుకు 3-4 వేల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 96 వేల మార్కును దాటింది. సోమవారం అన్ని రాష్ట్రాల్లో కలిపి కేసుల సంఖ్య 4 వేలు దాటిపోయింది. దీంతో ఇండియా లక్ష కరోనా కేసుల మార్కును టచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష ప్లస్ కరోనా కేసులు నమోదైన 11వ దేశం భారత్.
ఇండియా ఇప్పటికే చైనాను మించి కరోనా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో అత్యధికంగా మూడున్నర లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 2300 దాకా ఉంది. తెలంగాణలో కేసులు 1600 మార్కును దాటాయి.
దేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రం మహారాష్ట్రనే. మొత్తం ఇండియా కేసుల్లో మూడో వంతుకు పైగా ఇక్కడే ఉన్నాయి. అక్కడ కేసుల సంఖ్య 35 వేలను దాటేసింది. సోమవారం ఒక్కరోజే 2 వేలకు పైగా కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి.
తమిళనాడులో కూడా కరోనా ఉద్ధృతి బాగా కనిపిస్తోంది. అక్కడ కేసుల సంఖ్య 12 వేల మార్కును టచ్ చేసింది. సోమవారం 600 దాకా కేసులు నమోదయ్యాయి. గుజరాత్ సైతం దాదాపు 12 వేల కేసులతో కొనసాగుతోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…