Political News

ఇండియా.. ల‌క్ష క‌రోనా కేసులు

ఆ దేశంలో ఏకంగా ల‌క్ష ప్ల‌స్ క‌రోనా పాజిటివ్‌‌ కేసుల‌ట‌.. ఒక్క రోజులో అన్ని వేల కేసుల‌ట‌.. వందల్లో మ‌ర‌ణాల‌ట‌.. అంటూ నెల కింద‌ట వేరే దేశాల గురించి వార్త‌లు చ‌దువుకునే వాళ్లం. ఐతే ఇప్పుడు ఇండియానే ఆ స్థితికి వ‌చ్చేసింది. ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య సోమ‌వారం ల‌క్ష మార్కును ట‌చ్ చేసేసింది.

కొన్ని రోజులుగా స‌గ‌టున రోజుకు 3-4 వేల కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం నాటికి దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 96 వేల మార్కును దాటింది. సోమ‌వారం అన్ని రాష్ట్రాల్లో క‌లిపి కేసుల సంఖ్య 4 వేలు దాటిపోయింది. దీంతో ఇండియా ల‌క్ష క‌రోనా కేసుల మార్కును ట‌చ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష ప్ల‌స్ క‌రోనా కేసులు న‌మోదైన 11వ దేశం భార‌త్.

ఇండియా ఇప్ప‌టికే చైనాను మించి క‌రోనా కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో అత్య‌ధికంగా మూడున్న‌ర‌ ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన ప‌డ్డారు. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య 2300 దాకా ఉంది. తెలంగాణ‌లో కేసులు 1600 మార్కును దాటాయి.

దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులున్న రాష్ట్రం మ‌హారాష్ట్ర‌నే. మొత్తం ఇండియా కేసుల్లో మూడో వంతుకు పైగా ఇక్క‌డే ఉన్నాయి. అక్క‌డ కేసుల సంఖ్య 35 వేల‌ను దాటేసింది. సోమ‌వారం ఒక్క‌రోజే 2 వేల‌కు పైగా కేసులు ఆ రాష్ట్రంలో న‌మోద‌య్యాయి.

త‌మిళ‌నాడులో కూడా క‌రోనా ఉద్ధృతి బాగా క‌నిపిస్తోంది. అక్క‌డ కేసుల సంఖ్య 12 వేల మార్కును ట‌చ్ చేసింది. సోమ‌వారం 600 దాకా కేసులు న‌మోద‌య్యాయి. గుజ‌రాత్ సైతం దాదాపు 12 వేల కేసుల‌తో కొన‌సాగుతోంది.

This post was last modified on May 18, 2020 11:35 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago