Political News

కామెడీ అయిపోయిన వైసీపీ మంత్రి

చేసినవి చెప్పుకుంటేనే అతిశయోక్తిగా చూసే రోజులివి. సామాజిక మాధ్యమాల్లో శూల శోధన చేసి ఆ గొప్పల్లో ఉన్న తప్పులేంటో బయటికి తీసి పెట్టేస్తారు నెటిజన్లు. అలాంటిది చేయనివి చెప్పుకుంటే వాళ్లు ఊరుకుంటారా? ఇలా చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని, ఉన్న కంపెనీలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొడుతూ.. కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డం పడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య జనాల్లోకి కూడా ఈ విషయం బాగా వెళ్లిపోయింది. కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూ అభివృద్ధిని పట్టించుకోవట్లేదంటూ జగన్ ప్రభుత్వంపై తరచుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రచారం నిజం కాదని చెప్పాలనుకున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ గత రెండేళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి వెల్లడించారు. తాము టీడీపీ ప్రభుత్వంలా గొప్పలకు పోవడం లేదని, చేసింది కూడా సరిగా చెప్పుకోవడం లేదని ఆయనన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలోకి పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు వచ్చాయని, వేల కోట్ల పెట్టుబడులు తేగలిగామని ఆయనన్నారు. ఈ వివరాలతో ఒక జాబితాను కూడా మీడియాకు రిలీజ్ చేశారాయన. ఐతే అందులో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ల లిస్ట్ చూస్తే అవన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చినవని ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ముఖ్యంగా అనంతపురంలో కియా కంపెనీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనత అని ఎవ్వరినడిగినా చెప్పేస్తారు. కానీ ఈ కంపెనీ 2019 ఆగస్టులో వచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. అలాగే చిత్తూరులో వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన అపోలో టైర్స్, హీరో మోటాకార్ప్ సంస్థల రాక కూడా వైసీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నారు. కానీ ఇవి కూడా బాబు హయాంలో వచ్చినవే.

వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 కంపెనీలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా రూ.30 వేల దాకా పెట్టుబడులు వచ్చాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇందులో పైన చెప్పుకున్న మూడు కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువే రూ.15 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. మిగతా జాబితాలోనూ కొన్ని బాబు హయాంలో వచ్చినవే అంటూ ఆధారాలతో సహా టీడీపీ మద్దతుదారులు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో ఈ జాబితాను పంచుకున్న గౌతమ్ రెడ్డి కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేయడాన్ని చూస్తే ఈ జాబితా మీద ఆయనకే విశ్వాసం లేనట్లుంది. గత ప్రభుత్వ ఘనతల్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూసి గౌతమ్ రెడ్డి కామెడీ అయిపోతున్న మాట వాస్తవం.

This post was last modified on June 10, 2021 5:54 pm

Share

Recent Posts

విశ్వనాథంని కవ్విస్తున్న విశాల్

వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్…

58 minutes ago

వరుణ్ తేజ్ నమ్మలేని నిజం ఇది

వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…

3 hours ago

జడల్ జమానా మీద మిశ్రమ స్పందనా

న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…

5 hours ago

వింక్ భామకు పిచ్చి ప్రశ్న

సోషల్ మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా ఫేమ్ తెచ్చిపెడుతుందో ఊహించలేం. మలయాళ అమ్మాయి ప్రియ ప్రకాష్ వారియర్ అనుకోకుండా అలాగే…

8 hours ago

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

12 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

14 hours ago