Political News

కామెడీ అయిపోయిన వైసీపీ మంత్రి

చేసినవి చెప్పుకుంటేనే అతిశయోక్తిగా చూసే రోజులివి. సామాజిక మాధ్యమాల్లో శూల శోధన చేసి ఆ గొప్పల్లో ఉన్న తప్పులేంటో బయటికి తీసి పెట్టేస్తారు నెటిజన్లు. అలాంటిది చేయనివి చెప్పుకుంటే వాళ్లు ఊరుకుంటారా? ఇలా చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని, ఉన్న కంపెనీలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొడుతూ.. కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డం పడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య జనాల్లోకి కూడా ఈ విషయం బాగా వెళ్లిపోయింది. కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూ అభివృద్ధిని పట్టించుకోవట్లేదంటూ జగన్ ప్రభుత్వంపై తరచుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రచారం నిజం కాదని చెప్పాలనుకున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ గత రెండేళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి వెల్లడించారు. తాము టీడీపీ ప్రభుత్వంలా గొప్పలకు పోవడం లేదని, చేసింది కూడా సరిగా చెప్పుకోవడం లేదని ఆయనన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలోకి పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు వచ్చాయని, వేల కోట్ల పెట్టుబడులు తేగలిగామని ఆయనన్నారు. ఈ వివరాలతో ఒక జాబితాను కూడా మీడియాకు రిలీజ్ చేశారాయన. ఐతే అందులో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ల లిస్ట్ చూస్తే అవన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చినవని ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ముఖ్యంగా అనంతపురంలో కియా కంపెనీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనత అని ఎవ్వరినడిగినా చెప్పేస్తారు. కానీ ఈ కంపెనీ 2019 ఆగస్టులో వచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. అలాగే చిత్తూరులో వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన అపోలో టైర్స్, హీరో మోటాకార్ప్ సంస్థల రాక కూడా వైసీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నారు. కానీ ఇవి కూడా బాబు హయాంలో వచ్చినవే.

వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 కంపెనీలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా రూ.30 వేల దాకా పెట్టుబడులు వచ్చాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇందులో పైన చెప్పుకున్న మూడు కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువే రూ.15 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. మిగతా జాబితాలోనూ కొన్ని బాబు హయాంలో వచ్చినవే అంటూ ఆధారాలతో సహా టీడీపీ మద్దతుదారులు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో ఈ జాబితాను పంచుకున్న గౌతమ్ రెడ్డి కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేయడాన్ని చూస్తే ఈ జాబితా మీద ఆయనకే విశ్వాసం లేనట్లుంది. గత ప్రభుత్వ ఘనతల్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూసి గౌతమ్ రెడ్డి కామెడీ అయిపోతున్న మాట వాస్తవం.

This post was last modified on June 10, 2021 5:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago