సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావడం గమనార్హం. ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.
అంతేకాదు, తీర్పుల విషయంలోనూ ఆలస్యం జరిగి కక్షిదారులకు న్యాయం సమయానికి అందడం లేదని.. న్యాయవాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇలాంటి సమస్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్నదే. తెలంగాణ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ సమస్య పీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై అనేక సార్లు కేంద్ర న్యాయశాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాయి.
అయినప్పటికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ.. తెలంగాణ హైకోర్టు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణలో న్యాయ వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
This post was last modified on June 10, 2021 8:31 am
కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కావాలంటే తొంబై రోజుల ముందే అప్లై చేసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిన్న…
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…