సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావడం గమనార్హం. ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.
అంతేకాదు, తీర్పుల విషయంలోనూ ఆలస్యం జరిగి కక్షిదారులకు న్యాయం సమయానికి అందడం లేదని.. న్యాయవాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇలాంటి సమస్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్నదే. తెలంగాణ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ సమస్య పీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై అనేక సార్లు కేంద్ర న్యాయశాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాయి.
అయినప్పటికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ.. తెలంగాణ హైకోర్టు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణలో న్యాయ వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
This post was last modified on June 10, 2021 8:31 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…