Political News

తెలంగాణ కోసం.. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నిర్ణ‌యంపై తెలంగాణ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్ర‌స్తుతం 24 మంది మాత్ర‌మే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయి.

అంతేకాదు, తీర్పుల విష‌యంలోనూ ఆల‌స్యం జ‌రిగి క‌క్షిదారుల‌కు న్యాయం స‌మ‌యానికి అంద‌డం లేద‌ని.. న్యాయ‌వాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇలాంటి స‌మ‌స్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్న‌దే. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ స‌మ‌స్య పీడిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విష‌యంపై అనేక సార్లు కేంద్ర న్యాయ‌శాఖ‌కు ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపాయి.

అయిన‌ప్ప‌టికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ క‌నిపించ‌లేదు. కాగా, ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ ర‌మ‌ణ‌.. తెలంగాణ హైకోర్టు స‌మ‌స్య‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఆయ‌న చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణ‌లో న్యాయ వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

This post was last modified on June 10, 2021 8:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…

10 minutes ago

బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…

13 minutes ago

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

3 hours ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

4 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

6 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

7 hours ago