సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావడం గమనార్హం. ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.
అంతేకాదు, తీర్పుల విషయంలోనూ ఆలస్యం జరిగి కక్షిదారులకు న్యాయం సమయానికి అందడం లేదని.. న్యాయవాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇలాంటి సమస్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్నదే. తెలంగాణ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ సమస్య పీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై అనేక సార్లు కేంద్ర న్యాయశాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాయి.
అయినప్పటికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ.. తెలంగాణ హైకోర్టు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణలో న్యాయ వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
This post was last modified on June 10, 2021 8:31 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…