సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావడం గమనార్హం. ఈ నిర్ణయంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి.
అంతేకాదు, తీర్పుల విషయంలోనూ ఆలస్యం జరిగి కక్షిదారులకు న్యాయం సమయానికి అందడం లేదని.. న్యాయవాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక, ఇలాంటి సమస్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్నదే. తెలంగాణ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ సమస్య పీడిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంపై అనేక సార్లు కేంద్ర న్యాయశాఖకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాయి.
అయినప్పటికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ రమణ.. తెలంగాణ హైకోర్టు సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణలో న్యాయ వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
This post was last modified on June 10, 2021 8:31 am
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…