Political News

తెలంగాణ కోసం.. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నిర్ణ‌యంపై తెలంగాణ వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య 42 ఉండాలి. అయితే.. ప్ర‌స్తుతం 24 మంది మాత్ర‌మే ఉన్నారు. దీంతో కేసులు ఇబ్బడి ముబ్బ‌డిగా పెరిగిపోతున్నాయి.

అంతేకాదు, తీర్పుల విష‌యంలోనూ ఆల‌స్యం జ‌రిగి క‌క్షిదారుల‌కు న్యాయం స‌మ‌యానికి అంద‌డం లేద‌ని.. న్యాయ‌వాదులు, న్యాయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక‌, ఇలాంటి స‌మ‌స్య ఒక్క తెలంగాణ కే కాకుండా.. దేశ‌వ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లోనూ ఉన్న‌దే. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. దాదాపు రెండేళ్లుగా ఈ స‌మ‌స్య పీడిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విష‌యంపై అనేక సార్లు కేంద్ర న్యాయ‌శాఖ‌కు ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు జ‌రిపాయి.

అయిన‌ప్ప‌టికీ.. ఎలాంటి ప్రోగ్రెస్ క‌నిపించ‌లేదు. కాగా, ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు సీజేఐగా ఉన్న ఎన్వీ ర‌మ‌ణ‌.. తెలంగాణ హైకోర్టు స‌మ‌స్య‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఆయ‌న చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. సంబంధిత ఫైలుకు ఆయన ఆమోదం తెలిపారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు ఫైలును సీజేఐ వెలికితీశారు. హైకోర్టు విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి మన్నించారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75శాతం పెంచారు. దీంతో తెలంగాణ‌లో న్యాయ వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

This post was last modified on June 10, 2021 8:31 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

6 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

7 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

10 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

11 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

11 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

12 hours ago