తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల పర్వం కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇందులోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన సైతం తీసుకువచ్చి ఆమె టార్గెట్ చేశారు.
ప్రధాని మోడీ వీఐపీ కల్చర్ను ప్రోత్సహిస్తున్నారని…. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై తాజాగా విజయశాంతి స్పందిస్తూ “135 కోట్ల పైబడి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి” అని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
“మొత్తం వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే…, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఒవైసీ గారు” అంటూ విజయశాంతి సెటైర్ వేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీని అటు ఎంఐఎంను ఏకకాలంలో విజయశాంతి టార్గెట్ చేసిన ఎపిసోడ్ పై ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on June 8, 2021 9:32 pm
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…
పహల్ గాం ఉగ్రదాడిని ప్రోత్సహించి భారత్ తో సున్నం పెట్టుకున్న దాయాదీ దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు షాకుల మీద…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన జయం రవి కుటుంబ వివాదం కొంత కాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.…
అదిగో పులి.. అంటే ఇదిగో తోక.. అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం పరుగులు పెడుతోంది. ప్రస్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో…
జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేయడం దాదాపు ఖరారయినట్టే. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బాలయ్య వైపు…