Political News

ద‌టీజ్ విజ‌య‌శాంతి… ఓవైసీకి మామూలు కౌంట‌ర్ కాదు

తెలంగాణ‌లో రాజ‌కీయం హాట్ హాట్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ న‌డుస్తుంటే మ‌రోవైపు టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండ‌గా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమ‌ర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇందులోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావ‌న సైతం తీసుకువ‌చ్చి ఆమె టార్గెట్ చేశారు.

ప్రధాని మోడీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని…. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై తాజాగా విజ‌య‌శాంతి స్పందిస్తూ “135 కోట్ల పైబ‌డి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి” అని విజయశాంతి కౌంట‌ర్ ఇచ్చారు. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

“మొత్తం వ్యాక్సిన్ల‌లో 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే…, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఒవైసీ గారు” అంటూ విజయశాంతి సెటైర్ వేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీని అటు ఎంఐఎంను ఏక‌కాలంలో విజ‌య‌శాంతి టార్గెట్ చేసిన ఎపిసోడ్ పై ఇరు పార్టీల నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

This post was last modified on June 8, 2021 9:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

2 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

6 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

7 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

8 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

8 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

10 hours ago