తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల పర్వం కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇందులోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన సైతం తీసుకువచ్చి ఆమె టార్గెట్ చేశారు.
ప్రధాని మోడీ వీఐపీ కల్చర్ను ప్రోత్సహిస్తున్నారని…. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై తాజాగా విజయశాంతి స్పందిస్తూ “135 కోట్ల పైబడి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి” అని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
“మొత్తం వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే…, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఒవైసీ గారు” అంటూ విజయశాంతి సెటైర్ వేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీని అటు ఎంఐఎంను ఏకకాలంలో విజయశాంతి టార్గెట్ చేసిన ఎపిసోడ్ పై ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on June 8, 2021 9:32 pm
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…