తెలంగాణలో రాజకీయం హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడుస్తుంటే మరోవైపు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటూ కామెంట్ల పర్వం కొనసాగుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అయితే, ప్రధాని మోడీపై ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇందులోకి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన సైతం తీసుకువచ్చి ఆమె టార్గెట్ చేశారు.
ప్రధాని మోడీ వీఐపీ కల్చర్ను ప్రోత్సహిస్తున్నారని…. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దీనిపై తాజాగా విజయశాంతి స్పందిస్తూ “135 కోట్ల పైబడి జనాభా ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజం ఓవైసీ జీ. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయి” అని విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS అధినేత కేసీఆర్ గారికి చెప్పలేదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
“మొత్తం వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం VIP కల్చర్ అయితే…, TRS రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా? ఒవైసీ గారు” అంటూ విజయశాంతి సెటైర్ వేశారు. ఇటు టీఆర్ఎస్ పార్టీని అటు ఎంఐఎంను ఏకకాలంలో విజయశాంతి టార్గెట్ చేసిన ఎపిసోడ్ పై ఇరు పార్టీల నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
This post was last modified on June 8, 2021 9:32 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…