వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఒక్క సీఎం జగన్ మినహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు పంపారు. దీనిలో ఏపీ సర్కారు తనపై వ్యవహరించిన తీరును రఘురామరాజు వివరించారు. ఒక ఎంపీగా ఉన్న తనపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆయన.. రాజద్రోహం సెక్షన్ను తొలగించేందుకు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు.
ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో.. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరించారు. ఏపీ సీఎం జగన్ కు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఈ విషయంపై పార్లమెంట్లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు రఘురామరాజు తెలిపారు. ఈ క్రమంలో తనకు మద్దతిచ్చేలా ఆయా పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రులు సూచించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో రాజద్రోహం సెక్షన్ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని రఘురామ కోరారు.ఈ సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిపై ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలని రఘురామ ముఖ్యమంత్రులను కోరడం గమనార్హం. ప్రస్తుతం రఘురామ రాసిన లేఖల విషయం సంచలనంగా మారడం గమనార్హం.
This post was last modified on June 7, 2021 9:54 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…