Political News

సీఎంల‌కు ర‌ఘురామ రాజు లేఖ‌.. ఏం కోరారంటే!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాశారు. ఒక్క సీఎం జ‌గ‌న్ మిన‌హా.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న లేఖ‌లు పంపారు. దీనిలో ఏపీ స‌ర్కారు త‌న‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును ర‌ఘురామ‌రాజు వివ‌రించారు. ఒక ఎంపీగా ఉన్న త‌న‌పైనే థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న ఆయ‌న‌.. రాజ‌ద్రోహం సెక్ష‌న్‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రులు ముందుకు రావాల‌ని కోరారు.

ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌ల్లో.. తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను వివరించారు. ఏపీ సీఎం జగన్ కు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.

ఈ విషయంపై పార్లమెంట్‌లో తాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ర‌ఘురామ‌రాజు తెలిపారు. ఈ క్ర‌మంలో తనకు మద్దతిచ్చేలా ఆయా పార్టీల‌ ఎంపీలకు ముఖ్య‌మంత్రులు సూచించాలని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని రఘురామ కోరారు.ఈ సెక్ష‌న్‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని.. దీనిపై ఇటీవ‌ల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా గ‌మ‌నించాల‌ని ర‌ఘురామ ముఖ్య‌మంత్రుల‌ను కోర‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ర‌ఘురామ రాసిన లేఖ‌ల విష‌యం సంచ‌ల‌నంగా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 7, 2021 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

3 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

3 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago