వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజు.. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఒక్క సీఎం జగన్ మినహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు పంపారు. దీనిలో ఏపీ సర్కారు తనపై వ్యవహరించిన తీరును రఘురామరాజు వివరించారు. ఒక ఎంపీగా ఉన్న తనపైనే థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆయన.. రాజద్రోహం సెక్షన్ను తొలగించేందుకు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు.
ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో.. తన అరెస్ట్, తదనంతర పరిణామాలను వివరించారు. ఏపీ సీఎం జగన్ కు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.
ఈ విషయంపై పార్లమెంట్లో తాను ప్రత్యేకంగా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్టు రఘురామరాజు తెలిపారు. ఈ క్రమంలో తనకు మద్దతిచ్చేలా ఆయా పార్టీల ఎంపీలకు ముఖ్యమంత్రులు సూచించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో రాజద్రోహం సెక్షన్ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని రఘురామ కోరారు.ఈ సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్నారని.. దీనిపై ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలని రఘురామ ముఖ్యమంత్రులను కోరడం గమనార్హం. ప్రస్తుతం రఘురామ రాసిన లేఖల విషయం సంచలనంగా మారడం గమనార్హం.
This post was last modified on June 7, 2021 9:54 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…