Political News

సీఎంల‌కు ర‌ఘురామ రాజు లేఖ‌.. ఏం కోరారంటే!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాశారు. ఒక్క సీఎం జ‌గ‌న్ మిన‌హా.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న లేఖ‌లు పంపారు. దీనిలో ఏపీ స‌ర్కారు త‌న‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును ర‌ఘురామ‌రాజు వివ‌రించారు. ఒక ఎంపీగా ఉన్న త‌న‌పైనే థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న ఆయ‌న‌.. రాజ‌ద్రోహం సెక్ష‌న్‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రులు ముందుకు రావాల‌ని కోరారు.

ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌ల్లో.. తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను వివరించారు. ఏపీ సీఎం జగన్ కు తప్ప అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు.

ఈ విషయంపై పార్లమెంట్‌లో తాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ర‌ఘురామ‌రాజు తెలిపారు. ఈ క్ర‌మంలో తనకు మద్దతిచ్చేలా ఆయా పార్టీల‌ ఎంపీలకు ముఖ్య‌మంత్రులు సూచించాలని లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. అదేస‌మ‌యంలో రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని రఘురామ కోరారు.ఈ సెక్ష‌న్‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని.. దీనిపై ఇటీవ‌ల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా గ‌మ‌నించాల‌ని ర‌ఘురామ ముఖ్య‌మంత్రుల‌ను కోర‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ర‌ఘురామ రాసిన లేఖ‌ల విష‌యం సంచ‌ల‌నంగా మార‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 7, 2021 9:54 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

23 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago