Political News

రాష్ట్రాల‌పై మోడీ రుస‌రుస‌.. మెత్త‌గానే మొత్తారుగా!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న నేప‌థ్యంలో , రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అనూహ్యంగా జాతి ముందుకు వ‌చ్చారు. సుమారు అర‌గంట సేపు ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌పై మోడీ మెత్త‌ని మాట‌ల‌తో ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.

మేం మోస్తున్నాం..
వాస్త‌వానికి ప్ర‌జారోగ్యం రాజ్యాంగంలో రాష్ట్రాల బాధ్య‌త‌గానే ఉంద‌న్న మోడీ.. క‌రోనా విష‌యంలో రాష్ట్రాల‌కు కేంద్రం ఎంతో ఉదార‌త‌తో ముందుకు వ‌చ్చి సాయం చేస్తోంద‌ని చెప్పారు. వైద్య రంగంలో మౌలిక వ‌స‌తులు పెంచామ‌ని, రాష్ట్రాల‌కు అనేక ప్రోత్సాహ‌కాలు ఇచ్చామ‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైన మందుల ఉత్పత్తి పెంచామ‌ని చెప్పుకొచ్చారు. కేంద్రం ముందు చూపుతో వ్యాక్సిన్ త‌యారు చేయ‌కుంటే మ‌రిన్ని ఇబ్బందులు ఉండేవ‌ని మోడీ వ్యాఖ్యానించారు.

రుస‌రుస‌లు..
క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రంలోని త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేస్తున్నా.. రాష్ట్రాల నుంచి, విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం త‌న‌ను క‌ల‌చి వేసింద‌ని మోడీ అన్నారు. టీకా విష‌యంలో రాష్ట్రాలు మాట మార్చాయ‌ని మోడీ దుయ్య‌బ‌ట్టారు. టీకాల‌ను ముందు తామే కొనుగోలు చేస్తాయ‌ని రాష్ట్రాలు చెప్పాయ‌న్నారు. ఆ త‌ర్వాత చేతులు ఎత్తేశాయ‌ని.. ఇక దీనిపై విప‌క్షాల‌ది అన‌వ‌స‌ర రాద్ధాంతంగా మోడీ కొట్టిపారేశారు. వ్యాక్సిన్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి.. ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ అందిస్తామ‌ని చెప్పారు.

ప్రైవేటుకు 25%
దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న, విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న టీకాల్లో ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు 25% టీకాల‌ను కేటాయించ‌నున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ చెప్పుకొచ్చారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో రూ.150కే వ్యాక్సిన్ వేసేలా రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అంతేకాదు, రాష్ట్రాలు ఇక నుంచి టీకాల‌పై పైసా కూడా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదన్నారు. వ్యాక్సిన్ విష‌యంలో అనేక అనుమానాలు, అపోహ‌లు ప్ర‌చారం అయ్యాయ‌న్న మోడీ.. అనేక మంది దీనిపై త‌ప్పుడు ప్ర‌చారం చేశారని ఒకింత మౌనంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 7, 2021 9:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓజీ భామ కొరియా యాత్ర

కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…

28 minutes ago

నిందితులను నడిపిస్తున్నారా.. ఏపీ హైకోర్టు ఏమందంటే!

ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…

29 minutes ago

ఒక‌ప్పుడు నాస్తికం.. ఇప్పుడు స‌నాత‌నం: నాగ‌బాబుపై ట్రోలింగ్

జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు.. బుధ‌వారం చేసిన వ్యాఖ్య‌లు, దీనికి ముందు కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న ఓ…

1 hour ago

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

2 hours ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

3 hours ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

4 hours ago