తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటూ పదే పదే టీడీపీ నేతలు చెప్పుకొంటుంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట అంటే అదే ఫైనల్ అని నడుచుకునే సంస్కృతి పార్టీలో ఉందని వివరిస్తుంటారు. అయితే, అలాంటి పార్టీలో, అందులోనూ కుప్పంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజక వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలా స్పందించనున్నారనే ఉత్కంఠ సహజంగానే నెలకొంది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ జెండాను కుప్పం నియోజకవర్గంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు ఎగరేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో మారుతున్న పరిణామాలకు నిదర్శనమా అనే టాక్ సైతం వినిపిస్తోంది.
కాగా, కుప్పంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఇదే మొదటిసారి కాదు. ఇటీవల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సమయంలో చంద్రబాబు వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. అయితే, తాజాగా మళ్లీ అదే పరిస్థితి కుప్పంలో జరగడం చర్చకు కారణంగా మారుతోంది.
This post was last modified on June 6, 2021 9:48 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…