తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటూ పదే పదే టీడీపీ నేతలు చెప్పుకొంటుంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట అంటే అదే ఫైనల్ అని నడుచుకునే సంస్కృతి పార్టీలో ఉందని వివరిస్తుంటారు. అయితే, అలాంటి పార్టీలో, అందులోనూ కుప్పంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజక వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలా స్పందించనున్నారనే ఉత్కంఠ సహజంగానే నెలకొంది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ జెండాను కుప్పం నియోజకవర్గంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సభ్యులు ఎగరేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో మారుతున్న పరిణామాలకు నిదర్శనమా అనే టాక్ సైతం వినిపిస్తోంది.
కాగా, కుప్పంలో ఎన్టీఆర్ ప్రస్తావన ఇదే మొదటిసారి కాదు. ఇటీవల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సమయంలో చంద్రబాబు వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. అయితే, తాజాగా మళ్లీ అదే పరిస్థితి కుప్పంలో జరగడం చర్చకు కారణంగా మారుతోంది.
This post was last modified on June 6, 2021 9:48 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…